ETV Bharat / bharat

సింధు జల వివాదాలపై నేడు భారత్​-పాక్​ భేటీ

author img

By

Published : Mar 23, 2021, 6:35 AM IST

పాక్​కు చెందిన జల నిపుణుల బృందం సోమవారం భారత్​కు చేరుకుంది. మంగళ, బుధవారాల్లో.. దిల్లీలో జరిగే వార్షిక సింధు నదీ సమావేశంలో ఈ బృందం పాల్గొననుంది. సింధు నదీ జలాలపై ఇరు దేశాలు చర్చించుకోనున్నట్టు సమాచారం.

Pakistani delegation arrives in India for annual Permanent Indus Commission meeting
సింధూ జలాల వివాదాలపై భారత్​-పాక్​ భేటీ

పాకిస్థాన్​ సింధు కమిషనర్​ సయ్యద్​ మహమ్మద్​ మెహర్​ అలీ షా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం భారత్​కు చేరుకుంది. మంగళ, బుధవారాల్లో(ఈ నెల 23, 24న) సింధు నదీ వార్షిక సమావేశాలు జరగనుండగా.. దానికి ఈ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఇరు దేశాల కమిషనర్లు పాల్గొనే ఈ భేటీలో.. సింధు జలాల ఒప్పందంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

భారత ప్రతినిధి బృందానికి పీ.కే.సక్సేనా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు కేంద్ర జల కమిషన్​, కేంద్ర విద్యుత్​ అథారిటీ, నేషనల్​ హైడ్రో ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్​ సలహాదారులు పాల్గొననున్నారు.

స్నేహపూర్వకంగానే..

చీనాబ్​ నదిపై భారత్​ నిర్మిస్తున్న జల విద్యుత్​ ప్రాజెక్టులపై పాక్​ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఈ అంశమై చర్చించే అవకాశముంది. అయితే.. సింధు జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ) ఒప్పందానుసారం.. స్నేహపూర్వకంగానే తమ సమస్యల్ని పరిష్కరించుకుంటామని సక్సేనా వెల్లడించారు.

1960లో జరిగిన సింధు జల ఒప్పంద నిబంధనల ప్రకారం.. ఇరు దేశాల కమిషనర్లు పాక్​ లేదా భారత్​లో ఏడాదికి ఓసారి భేటీ కావాల్సి ఉంటుంది. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో దిల్లీ వేదికగా జరగాల్సిన తొలి సమావేశం రద్దయింది. రెండు దేశాలు చివరిసారిగా 2018 ఆగస్టులో లాహోర్‌లో సమావేశమయ్యాయి.

జమ్ముకశ్మీర్​లో అధికరణ-370 రద్దు అనంతరం.. తొలిసారి జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 'కరోనాతో మరణించిన సైనికులకు పరిహారం ఉండదు'

పాకిస్థాన్​ సింధు కమిషనర్​ సయ్యద్​ మహమ్మద్​ మెహర్​ అలీ షా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం భారత్​కు చేరుకుంది. మంగళ, బుధవారాల్లో(ఈ నెల 23, 24న) సింధు నదీ వార్షిక సమావేశాలు జరగనుండగా.. దానికి ఈ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఇరు దేశాల కమిషనర్లు పాల్గొనే ఈ భేటీలో.. సింధు జలాల ఒప్పందంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

భారత ప్రతినిధి బృందానికి పీ.కే.సక్సేనా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు కేంద్ర జల కమిషన్​, కేంద్ర విద్యుత్​ అథారిటీ, నేషనల్​ హైడ్రో ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్​ సలహాదారులు పాల్గొననున్నారు.

స్నేహపూర్వకంగానే..

చీనాబ్​ నదిపై భారత్​ నిర్మిస్తున్న జల విద్యుత్​ ప్రాజెక్టులపై పాక్​ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఈ అంశమై చర్చించే అవకాశముంది. అయితే.. సింధు జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ) ఒప్పందానుసారం.. స్నేహపూర్వకంగానే తమ సమస్యల్ని పరిష్కరించుకుంటామని సక్సేనా వెల్లడించారు.

1960లో జరిగిన సింధు జల ఒప్పంద నిబంధనల ప్రకారం.. ఇరు దేశాల కమిషనర్లు పాక్​ లేదా భారత్​లో ఏడాదికి ఓసారి భేటీ కావాల్సి ఉంటుంది. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో దిల్లీ వేదికగా జరగాల్సిన తొలి సమావేశం రద్దయింది. రెండు దేశాలు చివరిసారిగా 2018 ఆగస్టులో లాహోర్‌లో సమావేశమయ్యాయి.

జమ్ముకశ్మీర్​లో అధికరణ-370 రద్దు అనంతరం.. తొలిసారి జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 'కరోనాతో మరణించిన సైనికులకు పరిహారం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.