కశ్మీర్లో భారీ ఎత్తున అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు సున్నిత లక్ష్యాల కోసం చూస్తున్నాయని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్. పొరుగు దేశం దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు కఠిన నిఘా చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
కశ్మీర్ జోన్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు దిల్బాగ్ సింగ్.
" పాకిస్థాన్, దాని అనుబంధ సంస్థలు కశ్మీర్లో అలజడులు సృష్టించేందుకు సున్నిత లక్ష్యాల కోసం చూస్తున్న క్రమంలో భద్రతా పరమైన చర్యలను కట్టుదిట్టం చేయాలి. దేశ వ్యతిరకే కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా తీవ్రవాద నిరోధక చర్యలను పెంచాలి. జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు దాని అనుబంధ ఏజెన్సీలు, భద్రతా దళాలు శాంతి అజెండాను ముందుకు తీసుకెళ్లాలి. గత ఏడాదిగా ఎంతో సాధించాం. కానీ భవిష్యత్తులో అంతకు మించి సాధించాలి. "
- దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ
శ్రీనగర్-జమ్ము జాతీయ రదహారిలో మోహరించిన బలగాలకు సీసీటీవీ కెమెరాలు, ఇతర సామగ్రి కలిగిన పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చనున్నట్లు తెలిపారు డీజీపీ. ఈ వాహనాలతో బలగాలకు మరింత బలం చేకూరనుందన్నారు. కశ్మీర్ లోయలో ఇటీవల భారీగా కురుస్తోన్న మంచులోనూ పోలీసు బలగాలు ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నాయని కొనియాడారు.
ఇదీ చూడండి: ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు