ETV Bharat / bharat

2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసు

author img

By

Published : Jul 30, 2021, 10:27 PM IST

దేశవ్యాప్తంగా 2.27 లక్షల మంది గర్భిణీలకు కొవిడ్​ టీకా తొలిడోసు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. శుక్రవారం వెల్లడించింది. అత్యధికంగా 78,838 మంది గర్భిణీలకు టీకాలు అందించి.. తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

pregnant women
గర్భిణీలకు కొవిడ్​ తొలిడోసు

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసును అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధిక 78,838 మంది గర్భిణీలకు టీకాలు వేసి.. తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్​(34,228), ఒడిశా(29,821), మధ్యప్రదేశ్​(21,842), కేరళ(18,423), కర్ణాటక(16,673) తర్వాత స్థానాల్లో ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.

అలాగే గర్భిణీ స్త్రీలకు ఇన్​ఫెక్షన్​ వల్ల ప్రమాదాలు, టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వారిలో వ్యాక్సిన్​ తీసుకోవాలా.. వద్దా అనే విషయం తెలుస్తోందని పేర్కొంది.

46 కోట్లు దాటిన వ్యాక్సినేషన్​

దేశంలో ఇప్పటివరకు 46 కోట్ల మందికిపైగా టీకాలు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 44 లక్షల 39 వేల మందికి కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్​, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు కోటి మందికిపైగా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపింది.

యాచకుల కోసం ప్రత్యేక డ్రైవ్​

టీకా అందుకోవడానికి వెసులుబాటులేని.. నిరాశ్రయులు, యాచకుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. ఎన్​జీఓలు, సామాజిక కార్యకర్తలు, వలంటీర్ల సాయం తీసుకుని ఈ డ్రైవ్​ నిర్వహించాలని లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి: మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 2.27 లక్షల మంది గర్భిణీలకు టీకా తొలి డోసును అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధిక 78,838 మంది గర్భిణీలకు టీకాలు వేసి.. తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్​(34,228), ఒడిశా(29,821), మధ్యప్రదేశ్​(21,842), కేరళ(18,423), కర్ణాటక(16,673) తర్వాత స్థానాల్లో ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.

అలాగే గర్భిణీ స్త్రీలకు ఇన్​ఫెక్షన్​ వల్ల ప్రమాదాలు, టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వారిలో వ్యాక్సిన్​ తీసుకోవాలా.. వద్దా అనే విషయం తెలుస్తోందని పేర్కొంది.

46 కోట్లు దాటిన వ్యాక్సినేషన్​

దేశంలో ఇప్పటివరకు 46 కోట్ల మందికిపైగా టీకాలు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 44 లక్షల 39 వేల మందికి కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్లు పేర్కొంది. మధ్యప్రదేశ్​, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు కోటి మందికిపైగా టీకాలు పంపిణీ చేసినట్లు తెలిపింది.

యాచకుల కోసం ప్రత్యేక డ్రైవ్​

టీకా అందుకోవడానికి వెసులుబాటులేని.. నిరాశ్రయులు, యాచకుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. ఎన్​జీఓలు, సామాజిక కార్యకర్తలు, వలంటీర్ల సాయం తీసుకుని ఈ డ్రైవ్​ నిర్వహించాలని లేఖలో పేర్కొంది.

ఇదీ చూడండి: మళ్లీ కొవిడ్ విజృంభణ.. రాష్ట్రాల్లో కొత్త ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.