ETV Bharat / bharat

15 లక్షలమందికి నో మాస్క్​- రూ. 30 కోట్ల జరిమానా!

author img

By

Published : Feb 17, 2021, 5:16 PM IST

కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్కు నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తోంది. ఇలా గతేడాది ఏప్రిల్​ నుంచి ఇప్పటివరకు ముంబయిలో సుమారు 15లక్షల మందిని గుర్తించినట్టు వెల్లడించిన అధికారులు.. వీరి నుంచి దాదాపు రూ. 30 కోట్లకుపైనే వసూలు చేసినట్లు తెలిపారు.

Over 15 lakh caught without masks in Mumbai since April 2020
పదినెలల్లో 15లక్షల మందికిపైగా మాస్కుల్లేకుండా..

బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్లేకుండా తిరిగిన వారిలో గతేడాది ఏప్రిల్​ నుంచి ఈ నెల 15వరకు.. సుమారు 15లక్షల మందిని గుర్తించారు మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు. వారి నుంచి జరిమానాల రూపంలో సుమారు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ లేకుండా తిరిగితే రూ.200 జరిమానా విధిస్తున్నారు అధికారులు. అలా.. సోమవారం(ఈ నెల 15న) ఒక్కరోజే దాదాపు 13 వేల మంది నుంచి రూ.26,01,600 జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ రకంగా 2020 ఏప్రిల్​ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు.. ముంబయి నగరంలో 15.16 లక్షల మందిని గుర్తించి 30.69 కోట్లు రాబట్టినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. లేదంటే మరోసారి లాక్​డౌన్​ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'హెచ్​ఐవీ ఉందని బడి నుంచి పిల్లల బహిష్కరణ'

బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్లేకుండా తిరిగిన వారిలో గతేడాది ఏప్రిల్​ నుంచి ఈ నెల 15వరకు.. సుమారు 15లక్షల మందిని గుర్తించారు మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు. వారి నుంచి జరిమానాల రూపంలో సుమారు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ లేకుండా తిరిగితే రూ.200 జరిమానా విధిస్తున్నారు అధికారులు. అలా.. సోమవారం(ఈ నెల 15న) ఒక్కరోజే దాదాపు 13 వేల మంది నుంచి రూ.26,01,600 జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ రకంగా 2020 ఏప్రిల్​ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు.. ముంబయి నగరంలో 15.16 లక్షల మందిని గుర్తించి 30.69 కోట్లు రాబట్టినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. లేదంటే మరోసారి లాక్​డౌన్​ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'హెచ్​ఐవీ ఉందని బడి నుంచి పిల్లల బహిష్కరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.