ETV Bharat / bharat

'దిల్లీ హింస'లో మరో వ్యక్తి అరెస్ట్​

దిల్లీ హింసకు సంబంధించి మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎర్రకోట ఘటనకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య 127కు చేరింది. చంఢీగడ్​కు చెందిన క్రైం బ్రాంచ్​ పోలీసులు 60ఏళ్ల సుఖ్​దేవ్​ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Feb 8, 2021, 5:33 AM IST

One more held in connection with Red Fort violence on R-Day
దిల్లీ హింస: ఎర్రకోట ఘటనలో మరో ఆందోళనకారుడు అరెస్ట్​

దిల్లీ ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట విధ్వంసానికి సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసుల్లో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 127కు చేరింది.

చంఢీగడ్​కు చెందిన 60ఏళ్ల సుఖ్​దేవ్​ సింగ్​ను క్రైం బ్రాంచ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నటుడు దీప్​ సిద్ధూ, జుగరాజ్​ సింగ్​, గుర్​జాత్​ సింగ్, సుఖ్​దేవ్​ సింగ్​ల సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు ప్రకటించారు. సుఖ్​దేవ్​ సింగ్​ ఆందోళనకారులను ఎర్రకోట వైపు నడిపించినట్లు ఆధారాలు ఉన్నాయని సీనియర్​ పోలీస్ అధికారి వివరించారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ జనవరి 26న రైతులు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ఎర్రకోట వద్దకు చేరుకుని ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో రైతులు- పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చదవండి : 'రైతులు ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం'

దిల్లీ ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట విధ్వంసానికి సంబంధించి మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసుల్లో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 127కు చేరింది.

చంఢీగడ్​కు చెందిన 60ఏళ్ల సుఖ్​దేవ్​ సింగ్​ను క్రైం బ్రాంచ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నటుడు దీప్​ సిద్ధూ, జుగరాజ్​ సింగ్​, గుర్​జాత్​ సింగ్, సుఖ్​దేవ్​ సింగ్​ల సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు ప్రకటించారు. సుఖ్​దేవ్​ సింగ్​ ఆందోళనకారులను ఎర్రకోట వైపు నడిపించినట్లు ఆధారాలు ఉన్నాయని సీనియర్​ పోలీస్ అధికారి వివరించారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ జనవరి 26న రైతులు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ఎర్రకోట వద్దకు చేరుకుని ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో రైతులు- పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చదవండి : 'రైతులు ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.