ETV Bharat / bharat

'భారత్​-చైనా ఎఫ్​డీఐ నిబంధనలు యథాతథం'

తూర్పు లద్ధాఖ్​లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. బలగాల ఉపసంహరణ తర్వాత.. చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది.

author img

By

Published : Feb 23, 2021, 5:24 PM IST

No change in policy on Chinese FDI post disengagement
'భారత్​-చైనా 'ఎఫ్​డీఐ' నిబంధనల్లో మార్పు లేదు'

బలగాల ఉపసంహరణ తర్వాత చైనాతో భారత్​కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన తొలగిపోనున్న నేపథ్యంలో భారత్​లో పెట్టుబడి పెట్టేందుకు చైనా కంపెనీలు తరలి వస్తాయని మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.

" చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్​లో రద్దు చేయాలన్న ప్రణాళిక సైతం మా వద్ద లేదు. ఎప్పటిలాగానే చైనా నుంచి వచ్చే కంపెనీలు భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించాలి. దేశ భద్రతకు ముప్పు లేదని భావించిన కంపెనీలకే కేంద్ర అనుమతి ఉంటుంది."

-- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు

అయితే హాంకాంగ్​కు చెందిన సిటిజెన్​ వాచెస్​ కంపెనీ, జపాన్​కు చెందిన నిప్పన్​ పెయింట్స్​ కంపెనీకి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెట్​ ప్లే అనే స్పోర్ట్స్​ కంపెనీకి సైతం కేంద్రం ఇటీవల అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి.

గల్వాన్​ ఘటన తరువాత చైనాపై ఎఫ్​డీఐ ఆంక్షలను కఠినతరం చేసింది భారత్​. చైనాకు చెందిన కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

ఫిబ్రవరి 10న భారత్- చైనా మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డ్రాగన్ ప్రకటించగా.. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ వేదికగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణపై అమెరికా నిశిత పరిశీలన

బలగాల ఉపసంహరణ తర్వాత చైనాతో భారత్​కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన తొలగిపోనున్న నేపథ్యంలో భారత్​లో పెట్టుబడి పెట్టేందుకు చైనా కంపెనీలు తరలి వస్తాయని మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.

" చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్​లో రద్దు చేయాలన్న ప్రణాళిక సైతం మా వద్ద లేదు. ఎప్పటిలాగానే చైనా నుంచి వచ్చే కంపెనీలు భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించాలి. దేశ భద్రతకు ముప్పు లేదని భావించిన కంపెనీలకే కేంద్ర అనుమతి ఉంటుంది."

-- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు

అయితే హాంకాంగ్​కు చెందిన సిటిజెన్​ వాచెస్​ కంపెనీ, జపాన్​కు చెందిన నిప్పన్​ పెయింట్స్​ కంపెనీకి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెట్​ ప్లే అనే స్పోర్ట్స్​ కంపెనీకి సైతం కేంద్రం ఇటీవల అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి.

గల్వాన్​ ఘటన తరువాత చైనాపై ఎఫ్​డీఐ ఆంక్షలను కఠినతరం చేసింది భారత్​. చైనాకు చెందిన కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

ఫిబ్రవరి 10న భారత్- చైనా మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డ్రాగన్ ప్రకటించగా.. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ వేదికగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణపై అమెరికా నిశిత పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.