దక్షిణ అమెరికా ఈక్వెడార్ సమీపంలో తాను కొనుగోలు చేసిన 'కైలాస' దీవికి సందర్శకులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు వివాదాస్పద గురువు నిత్యానంద. కైలాస వెళ్లాలనుకునేవారికి మూడు రోజుల పాటు ఉచిత వీసాతో పాటు.. భోజనం, ఇతర వసతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారాయన.
'కైలాసం' వెళ్లదలచిన వారు గురువారం నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు నిత్యానంద. ఇందుకోసం contact@kailasa.orgకు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. అయితే.. ఈ ఉచిత సౌకర్యం ఆస్ట్రేలియా నుంచి వెళ్లే భక్తులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంటే కైలాసకు వెళ్లదలచినవారు సొంత ఖర్చులతో తొలుత ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సి ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు విమానం(గరుడ) ద్వారా కైలాసకు వెళ్లవచ్చు. అక్కడ వారికి మూడురోజుల పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను అందిస్తారు.
ఇదీ చదవండి: 'అప్పటివరకు సాగు చట్టాలు నిలిపివేయగలరా?'