ETV Bharat / bharat

'రాహుల్​ కుమారుడే కాంగ్రెస్​ నెక్స్ట్​ ప్రెసిడెంట్​'

కాంగ్రెస్​ తదుపరి జాతీయ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ(rahul gandhi news) కుమారుడే అవుతారని పేర్కొన్నారు ఉత్తర్​ప్రదేశ్​ న్యాయశాఖ మంత్రి బ్రజేశ్​ పతాక్​. కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 350 సీట్లకుపైగా గెలుచుకుని భాజపా మళ్లీ అధికారం చెపడుతుందని జోస్యం చెప్పారు.

author img

By

Published : Sep 4, 2021, 5:26 PM IST

Next Cong president
రాహుల్​ గాంధీ కుమారుడే కాంగ్రెస్​ నెక్స్ట్​ ప్రెసిడెంట్

కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీల తదుపరి అధ్యక్షులు(next congress president) ఎవరో ప్రతిఒక్కరికీ తెలుసునన్నారు ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్​ పతాక్​. రానున్న 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 350 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బదౌన్​ జిల్లా కేంద్రంలోని పరశురామ్​ చౌక్​లో నిర్మించిన భగవాన్​ పరశురామ్​ విగ్రహం ప్రారంభించారు బ్రజేశ్​. అనంతరం మాట్లాడుతూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Next Cong president
మాట్లాడుతున్న యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేశ్​ పతాక్​

"కాంగ్రెస్​ పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడు(congress president)ఎవరో అందరికీ తెలుసు. రాహుల్​ గాంధీ(rahul gandhi news) వివాహం తర్వాత.. ఆయన కుమారుడే కాంగ్రెస్​కు జాతీయ అధ్యక్షుడు అవుతారు. అదే క్రమంలో అఖిలేశ్​ యాదవ్​ కుమారుడే సమాజ్​ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారు. అది ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ, భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేది ఒక్కరు కూడా చెప్పలేరు."

- బ్రజేశ్​ పతాక్​, యూపీ న్యాయశాఖ మంత్రి.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భాజపా మళ్లీ అధికారాన్ని చేబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రజేశ్​. ప్రతిపక్షాలు అధికారం కోసం మరో ఐదేళ్లు ఎదురుచాడాల్సి వస్తుందన్నారు. భాజపా కార్యకర్తలు మాత్రమే ప్రజలకు సేవ చేస్తూ.. వారితో పాటు కలిసిపోతున్నారని గుర్తు చేశారు. విపక్షాలకు సరైన విధానాలు లేవన్నారు. గత ఎన్నికల్లో వారిని ప్రజలు తిరస్కరించారని, 2022లోనూ అదే పునరావృతమవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: 'యూపీలో భాజపాదే మళ్లీ అధికారం- 300 సీట్లు ఖాయం!'

కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీల తదుపరి అధ్యక్షులు(next congress president) ఎవరో ప్రతిఒక్కరికీ తెలుసునన్నారు ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్​ పతాక్​. రానున్న 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 350 సీట్లకుపైగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బదౌన్​ జిల్లా కేంద్రంలోని పరశురామ్​ చౌక్​లో నిర్మించిన భగవాన్​ పరశురామ్​ విగ్రహం ప్రారంభించారు బ్రజేశ్​. అనంతరం మాట్లాడుతూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Next Cong president
మాట్లాడుతున్న యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేశ్​ పతాక్​

"కాంగ్రెస్​ పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడు(congress president)ఎవరో అందరికీ తెలుసు. రాహుల్​ గాంధీ(rahul gandhi news) వివాహం తర్వాత.. ఆయన కుమారుడే కాంగ్రెస్​కు జాతీయ అధ్యక్షుడు అవుతారు. అదే క్రమంలో అఖిలేశ్​ యాదవ్​ కుమారుడే సమాజ్​ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతారు. అది ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ, భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేది ఒక్కరు కూడా చెప్పలేరు."

- బ్రజేశ్​ పతాక్​, యూపీ న్యాయశాఖ మంత్రి.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భాజపా మళ్లీ అధికారాన్ని చేబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బ్రజేశ్​. ప్రతిపక్షాలు అధికారం కోసం మరో ఐదేళ్లు ఎదురుచాడాల్సి వస్తుందన్నారు. భాజపా కార్యకర్తలు మాత్రమే ప్రజలకు సేవ చేస్తూ.. వారితో పాటు కలిసిపోతున్నారని గుర్తు చేశారు. విపక్షాలకు సరైన విధానాలు లేవన్నారు. గత ఎన్నికల్లో వారిని ప్రజలు తిరస్కరించారని, 2022లోనూ అదే పునరావృతమవుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: 'యూపీలో భాజపాదే మళ్లీ అధికారం- 300 సీట్లు ఖాయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.