ETV Bharat / bharat

'నేపాల్​ 5 హెక్టార్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది'

author img

By

Published : Jun 25, 2022, 1:32 PM IST

భారత్​- నేపాల్​ భూ వివాదం ఇంకా పూర్తిగా చల్లారినట్లు కనపడం లేదు. ఉత్తరాఖండ్​ అటవీశాఖ తాజా నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత 12 ఏళ్లులో హెక్టార్ల కొద్ది భారత్​ భూభాగాన్ని నేపాల్​ ఆక్రమించుకుంటూ వస్తున్నట్లు అటవీశాఖ చెబుతోంది. ఈ మేరకు నివేదికను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందజేసింది.

nepal-occupied-5-hectares-of-india-land
'12ఏళ్లలో 5హెక్టార్ల భూమిని నేపాల్​ ఆక్రమించింది'

కాలాపానీ వివాదం నేపథ్యంలో భారత్​-నేపాల్​ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వివాదం సద్దమణిగి.. ఇరు దేశాలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. మరో షాకింగ్​ విషయం తెరపైకి వచ్చింది. నేపాల్​ నుంచి భారత్ స్నేహాన్ని కోరుకుంటుంటే.. ఆ దేశం మాత్రం ఉత్తరాఖండ్​ సరిహద్దులోని ఇండియా భూభాగంపై కన్నేసినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ చెబుతోంది. గత 12 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్​ సరిహద్దులోని భారతదేశ భూమిని నేపాల్​ ఆక్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.

చంపావత్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు అటవీశాఖకు చెందిన 5 హెక్టార్ల భారత భూమిని నేపాల్ ఆక్రమించినట్లు ఉత్తరాఖండ్​ అటవీశాఖ వెల్లడించింది. వాస్తవానికి ఈ విషయమై భారత ప్రభుత్వానికి నేపాల్, భూటాన్‌ సరిహద్దులో మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం సశాస్త్ర సీమా బాల్( ఎస్​ఎస్​బీ) నివేదించింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి.. ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర నివేదిక అందజేసింది.

సరిహద్దులోని భారత భూభాగాన్ని నేపాల్​ ఆక్రమిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అటవీశాఖ అలర్ట్​ అయ్యింది. దీంతో విచారణ చేపట్టగా.. ఈ 5 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలిందని ఆ నివేదికలో చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై ఉత్తరాఖండ్ అటవీ శాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ స్పందించారు. 'ఈ విషయం 2010 నాటిదని.. ఎస్​ఎస్​బీ కూడా భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. చంపావత్‌లోని పూర్ణగిరికి వచ్చిన భక్తులు.. నేపాల్​లోని భైరవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎంతో ప్రాశస్త్యం ఉన్న పూర్ణగిరి కోసమే.. నేపాల్​ ఆక్రమణలకు పాల్పడి ఉండొచ్చు. ఈ సమస్యపై భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతోంది' అని చెప్పారు సుబోధ్.

ఇదీ చదవండి: మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. హత్యనా? లేక ఇంకేమైనా?

కాలాపానీ వివాదం నేపథ్యంలో భారత్​-నేపాల్​ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వివాదం సద్దమణిగి.. ఇరు దేశాలు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. మరో షాకింగ్​ విషయం తెరపైకి వచ్చింది. నేపాల్​ నుంచి భారత్ స్నేహాన్ని కోరుకుంటుంటే.. ఆ దేశం మాత్రం ఉత్తరాఖండ్​ సరిహద్దులోని ఇండియా భూభాగంపై కన్నేసినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ చెబుతోంది. గత 12 సంవత్సరాలుగా ఉత్తరాఖండ్​ సరిహద్దులోని భారతదేశ భూమిని నేపాల్​ ఆక్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.

చంపావత్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు అటవీశాఖకు చెందిన 5 హెక్టార్ల భారత భూమిని నేపాల్ ఆక్రమించినట్లు ఉత్తరాఖండ్​ అటవీశాఖ వెల్లడించింది. వాస్తవానికి ఈ విషయమై భారత ప్రభుత్వానికి నేపాల్, భూటాన్‌ సరిహద్దులో మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం సశాస్త్ర సీమా బాల్( ఎస్​ఎస్​బీ) నివేదించింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి.. ఆ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర నివేదిక అందజేసింది.

సరిహద్దులోని భారత భూభాగాన్ని నేపాల్​ ఆక్రమిస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అటవీశాఖ అలర్ట్​ అయ్యింది. దీంతో విచారణ చేపట్టగా.. ఈ 5 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలిందని ఆ నివేదికలో చెప్పుకొచ్చారు.

ఈ విషయంపై ఉత్తరాఖండ్ అటవీ శాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ స్పందించారు. 'ఈ విషయం 2010 నాటిదని.. ఎస్​ఎస్​బీ కూడా భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. చంపావత్‌లోని పూర్ణగిరికి వచ్చిన భక్తులు.. నేపాల్​లోని భైరవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఎంతో ప్రాశస్త్యం ఉన్న పూర్ణగిరి కోసమే.. నేపాల్​ ఆక్రమణలకు పాల్పడి ఉండొచ్చు. ఈ సమస్యపై భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడుతోంది' అని చెప్పారు సుబోధ్.

ఇదీ చదవండి: మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. హత్యనా? లేక ఇంకేమైనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.