ETV Bharat / bharat

Crime Against Women: 2021లో మహిళలపై పెరిగిన దాడులు- 50% యూపీలోనే

author img

By

Published : Jan 1, 2022, 3:46 PM IST

Crime Against Women: 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగాయి. జాతీయ మహిళా కమీషన్- ఎన్​సీడబ్ల్యూ​ ఈ మేరకు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే 30 వేలకుపైగా ఫిర్యాదులు అందగా.. ఉత్తర్​ ప్రదేశ్​ నుంచే సుమారు 15 వేలు ఉన్నట్లు తెలిపింది.

complaints of crimes against women
complaints of crimes against women

Crime Against Women: 2020తో పోలిస్తే 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్‌- ఎన్​సీడబ్ల్యూ వెల్లడించింది. 2021లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 30 వేల 864 ఫిర్యాదులు అందాయన్న ఎన్​సీడబ్ల్యూ.. 2014 తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. వీటిలో 11 వేల ఫిర్యాదులు మానసిక వేధింపులకు సంబంధించినవి కాగా.. 6,633 గృహ హింస, 4,589 వరకట్న వేధింపులపై వచ్చినట్లు మహిళా కమీషన్​ తన నివేదికలో వెల్లడించింది.

Highest Number of Complaints from UP: మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచే 15 వేల 828 ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమీషన్‌ తెలిపింది. దిల్లీ నుంచి 3,336, మహారాష్ట్ర నుంచి 1504, హరియాణా, బిహార్‌ నుంచి చెరో 14 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు చెప్పింది. మహిళలు తమపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేలా వారిలో చైతన్యం కల్పిస్తుండటం వల్లే ఈ ఏడాది ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ చెప్పారు. బాధిత మహిళలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Crime Against Women: 2020తో పోలిస్తే 2021లో మహిళలపై దాడులు 30 శాతం పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్‌- ఎన్​సీడబ్ల్యూ వెల్లడించింది. 2021లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 30 వేల 864 ఫిర్యాదులు అందాయన్న ఎన్​సీడబ్ల్యూ.. 2014 తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. వీటిలో 11 వేల ఫిర్యాదులు మానసిక వేధింపులకు సంబంధించినవి కాగా.. 6,633 గృహ హింస, 4,589 వరకట్న వేధింపులపై వచ్చినట్లు మహిళా కమీషన్​ తన నివేదికలో వెల్లడించింది.

Highest Number of Complaints from UP: మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచే 15 వేల 828 ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమీషన్‌ తెలిపింది. దిల్లీ నుంచి 3,336, మహారాష్ట్ర నుంచి 1504, హరియాణా, బిహార్‌ నుంచి చెరో 14 వందలకు పైగా ఫిర్యాదులు అందినట్లు చెప్పింది. మహిళలు తమపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేలా వారిలో చైతన్యం కల్పిస్తుండటం వల్లే ఈ ఏడాది ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగినట్లు జాతీయ మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ చెప్పారు. బాధిత మహిళలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తొక్కిసలాటలో 12మంది మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. హెల్ప్​లైన్​ నంబర్ ఏర్పాటు

మద్యం వద్దు.. పాలు ముద్దు.. రావణుని న్యూ ఇయర్​ సందేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.