తమిళనాడులో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ఎఫ్) ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది. మధురై, పండి కోవిల్ ప్రాంతంలోని అమ్మ గ్రౌండ్లో హెలికాప్టర్లో దిగిన దళాలు.. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించాయి.
ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా స్పందించాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై దళాలు రిహార్సల్స్ చేశాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన 150 మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వేళ్లతో పెన్ను తిప్పి గిన్నిస్ రికార్డ్- ఏం టాలెంట్ గురూ!