ETV Bharat / bharat

రైల్​ రోకోపై నరేశ్​ టికాయిత్​ అభ్యంతరం

author img

By

Published : Feb 13, 2021, 5:56 PM IST

సంయుక్త కిసాన్​ మోర్చా ప్రకటించిన రైల్​ రోకోపై భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు నరేశ్​ టికాయిత్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తాము నిరసనలను వ్యక్తం చేయమని స్పష్టం చేశారు.

naresh tikaith
రైల్​ రోకోపై నరేశ్​ టికాయత్​ అభ్యంతరం

కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై నిరసనల్లో భాగంగా ఈనెల 18న సంయుక్త​ కిసాన్​ మోర్చా ప్రకటించిన రైల్​ రోకో​పై రైతు సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు, రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్ సోదరుడు నరేశ్ టికాయిత్​ తప్పుపట్టారు. ప్రజలను ఇబ్బందులకు​ గురిచేసే విధంగా ఉండే నిరసనలను తాము సమర్థించమని ప్రకటించారు. సంభల్​ జిల్లా సింహపురిసైని ప్రాంతంలో రైతు నేతలతో శుక్రవారం జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించని విధంగా తాము నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.

మా దగ్గర పనిచేయవు..

రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నరేశ్​ టికాయిత్​ మండిపడ్డారు. కర్షకులను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. రైతుల ముందు కేంద్రం ఎత్తులు పనిచేయవని తెలిపారు. రైతుల తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్​ మోర్చా బుధవారం కీలక ప్రకటనలు చేసింది.

ఈనెల 14న పుల్వామా ఘటనలో అమరులైన జవానులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన జరపనున్నారు రైతులు. 16న దివంగత నేత ఛోటూరామ్​ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ఈనెల 18న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : ఆ ఐదు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం

కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై నిరసనల్లో భాగంగా ఈనెల 18న సంయుక్త​ కిసాన్​ మోర్చా ప్రకటించిన రైల్​ రోకో​పై రైతు సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు, రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్ సోదరుడు నరేశ్ టికాయిత్​ తప్పుపట్టారు. ప్రజలను ఇబ్బందులకు​ గురిచేసే విధంగా ఉండే నిరసనలను తాము సమర్థించమని ప్రకటించారు. సంభల్​ జిల్లా సింహపురిసైని ప్రాంతంలో రైతు నేతలతో శుక్రవారం జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించని విధంగా తాము నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.

మా దగ్గర పనిచేయవు..

రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నరేశ్​ టికాయిత్​ మండిపడ్డారు. కర్షకులను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. రైతుల ముందు కేంద్రం ఎత్తులు పనిచేయవని తెలిపారు. రైతుల తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్​ మోర్చా బుధవారం కీలక ప్రకటనలు చేసింది.

ఈనెల 14న పుల్వామా ఘటనలో అమరులైన జవానులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన జరపనున్నారు రైతులు. 16న దివంగత నేత ఛోటూరామ్​ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించనున్నారు. ఈనెల 18న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : ఆ ఐదు రాష్ట్రాలకు కేంద్రం విపత్తు సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.