ETV Bharat / bharat

ఆస్పత్రిలో నగ్నంగా కొవిడ్ రోగులు- ఎందుకిలా? - naked covid patients lying near toilets

ఒడిశా మయూర్​భంజ్​లోని కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులు ఒంటిపై వస్త్రాలు లేకుండానే నేలమీద పడుకొని ఉన్న వీడియోలు వైరల్​గా మారాయి. మరికొందరు టాయిలెట్ల పక్కనే పడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి అత్యవసర విచారణకు ఆదేశించారు.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
KIMS: టాయిలెట్ల పక్కన నగ్నంగా కొవిడ్ రోగులు
author img

By

Published : Jun 1, 2021, 10:44 AM IST

ఒడిశా మయూర్​భంజ్​లో కరోనా బాధితులు నేలపైనే పడుకొని ఉన్న వీడియోలు బయటపడటం కలకలం సృష్టించింది. వారి ఒంటిపైన వస్త్రాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగుల పడకలు ఉండటం వీడియోలో కనిపిస్తోంది.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
నేలపై పడి ఉన్న రోగి
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
టాయిలెట్ల వద్ద కరోనా బాధితులు
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
నేలపైనే నగ్నంగా రోగులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
ఒంటిపై వస్త్రాలు లేకుండా కరోనా రోగి
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
బెడ్ పక్క నేలపై పడి ఉన్న బాధితుడు

విచారణకు ఆదేశం

ఈ దృశ్యాల గురించి తనకేం తెలియదని మయూర్​భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ చెప్పుకొచ్చారు. అయితే, ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

అంతకుముందు.. ఈ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు కలెక్టర్ వినీత్. రోగులకు చికిత్స జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. వార్డులలోని రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలోని ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- హైకోర్టు విచారణ యూట్యూబ్​లో లైవ్​- చరిత్రలోనే తొలిసారి!

ఒడిశా మయూర్​భంజ్​లో కరోనా బాధితులు నేలపైనే పడుకొని ఉన్న వీడియోలు బయటపడటం కలకలం సృష్టించింది. వారి ఒంటిపైన వస్త్రాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగుల పడకలు ఉండటం వీడియోలో కనిపిస్తోంది.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
నేలపై పడి ఉన్న రోగి
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
టాయిలెట్ల వద్ద కరోనా బాధితులు
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
నేలపైనే నగ్నంగా రోగులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
ఒంటిపై వస్త్రాలు లేకుండా కరోనా రోగి
covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
బెడ్ పక్క నేలపై పడి ఉన్న బాధితుడు

విచారణకు ఆదేశం

ఈ దృశ్యాల గురించి తనకేం తెలియదని మయూర్​భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ చెప్పుకొచ్చారు. అయితే, ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

అంతకుముందు.. ఈ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు కలెక్టర్ వినీత్. రోగులకు చికిత్స జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. వార్డులలోని రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలోని ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- హైకోర్టు విచారణ యూట్యూబ్​లో లైవ్​- చరిత్రలోనే తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.