ETV Bharat / bharat

మంత్రి అల్లుడి అరెస్ట్​తో డ్రగ్స్​ కేసులో కొత్త కోణం!

ఇటీవల వెలుగుచూసిన డగ్స్​ కేసుకు సంబంధించి ముంబయిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ). ఈ కేసుతో సంబంధం కలిగి ఉన్నారన్న ఆరోపణలతో రాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అల్లుడు సమీర్​ ఖాన్​ను అరెస్ట్​ చేసింది.

author img

By

Published : Jan 14, 2021, 1:26 PM IST

Narcotics control bureau
మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్​ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ). బుధవారం రాత్రి ముంబయిలో ఎన్​సీబీకి చెందిన పలు బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

మంత్రి అల్లుడు అరెస్ట్​..

ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అల్లుడు సమీర్​ ఖాన్​ను బుధవారం అరెస్ట్​ చేసింది ఎన్​సీబీ. ఈ కేసుకు సంబంధించి వారం క్రితం అరెస్టయిన బ్రిటన్​ వ్యక్తి కరణ్​ సంజ్నాని సహా మరో ఇద్దరితో రూ.20వేల ఆన్​లైన్​ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఎన్​సీబీ ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం సమీర్​ ఖాన్​ను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్​ చేసింది.

చట్టానికి ఎవరూ అతీతులు కాదు..

తన అల్లుడు సమీర్​ ఖాన్​ అరెస్ట్​పై స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ​ మంత్రి నవాబ్​ మాలిక్​. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టం అమలు కావాలన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని పేర్కొంటూ ట్వీట్​ చేశారు. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

Nawab Malik
నవాబ్​ మాలిక్​ ట్వీట్​

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముచ్చడ్​ పాన్​వాలాను అరెస్ట్​ చేసింది ఎన్​సీబీ. అలాగే.. బాలీవుడ్​ నటుడు అర్జున్​ రామ్​పాల్​ సోదరి కోమల్​ రాంపాల్​ను గత సోమవారం విచారించింది. అర్జున్​ రామ్​పాల్​ను సైతం ఈనెల 13న విచారించింది. అదే రోజు ఆయన ప్రేయసి గబ్రియెల్లా డెమెట్రియేడ్స్​ను సుమారు 6 గంటల పాటు ప్రశ్నించింది ఎన్​సీబీ.

ఇదీ చూడండి: రూ.4 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్​ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ). బుధవారం రాత్రి ముంబయిలో ఎన్​సీబీకి చెందిన పలు బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

మంత్రి అల్లుడు అరెస్ట్​..

ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అల్లుడు సమీర్​ ఖాన్​ను బుధవారం అరెస్ట్​ చేసింది ఎన్​సీబీ. ఈ కేసుకు సంబంధించి వారం క్రితం అరెస్టయిన బ్రిటన్​ వ్యక్తి కరణ్​ సంజ్నాని సహా మరో ఇద్దరితో రూ.20వేల ఆన్​లైన్​ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఎన్​సీబీ ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం సమీర్​ ఖాన్​ను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్​ చేసింది.

చట్టానికి ఎవరూ అతీతులు కాదు..

తన అల్లుడు సమీర్​ ఖాన్​ అరెస్ట్​పై స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ​ మంత్రి నవాబ్​ మాలిక్​. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టం అమలు కావాలన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని పేర్కొంటూ ట్వీట్​ చేశారు. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

Nawab Malik
నవాబ్​ మాలిక్​ ట్వీట్​

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముచ్చడ్​ పాన్​వాలాను అరెస్ట్​ చేసింది ఎన్​సీబీ. అలాగే.. బాలీవుడ్​ నటుడు అర్జున్​ రామ్​పాల్​ సోదరి కోమల్​ రాంపాల్​ను గత సోమవారం విచారించింది. అర్జున్​ రామ్​పాల్​ను సైతం ఈనెల 13న విచారించింది. అదే రోజు ఆయన ప్రేయసి గబ్రియెల్లా డెమెట్రియేడ్స్​ను సుమారు 6 గంటల పాటు ప్రశ్నించింది ఎన్​సీబీ.

ఇదీ చూడండి: రూ.4 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.