ETV Bharat / bharat

దిల్లీకి చేరుకున్న జమ్ముకశ్మీర్​ నేతలు

author img

By

Published : Jun 23, 2021, 10:58 PM IST

ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 24న సమావేశమున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్​కు చెందిన 14 మంది నేతలు దిల్లీకి చేరుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనె తదితర ప్రముఖులు దేశ రాజధానికి చేరుకున్నారు.

gupkar
గుప్కార్​

ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతామని గుప్కార్ (పీఓడీజీ) తెలిపిన నేపథ్యంలో.. జమ్ముకశ్మీర్​కు చెందిన 14 మంది నేతలు దిల్లీకి చేరుకున్నారు. ఆర్టికల్ 370​ రద్దుతో జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా తప్పించిన అనంతరం అక్కడి నేతలతో గురువారం నిర్వహించే సమావేశం మొదటిది. కశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించేందుకు.. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనె తదితరులను సమావేశానికి ప్రధాని మోదీ ఆహ్వానించారు.

సమావేశానికి హాజరయ్యే అంశంపై గుప్కార్ నేతలు​ మొదట తర్జనభర్జన పడ్డారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై.. ప్రధానితో మాట్లాడటాల్సిన అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ప్రధానితో భేటీ అవుతామని ప్రకటించారు. ఆర్టికల్​ 370 పునరుద్ధరణపై తగ్గేది లేదని స్పష్టం చేశారు.

గుప్కార్​ ఏంటీ?

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కీలక నేతల నిర్బంధం తర్వాత అక్కడి రాజకీయాలు స్తబ్దుగా సాగిపోయాయి. క్రమంగా కశ్మీర్​ ప్రయోజనాల కోసం అంటూ.. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఒకే గొడుగు కిందకు చేరారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏడీజీ) పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి ఈ కూటమి ప్రధాన డిమాండ్లు.

ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతామని గుప్కార్ (పీఓడీజీ) తెలిపిన నేపథ్యంలో.. జమ్ముకశ్మీర్​కు చెందిన 14 మంది నేతలు దిల్లీకి చేరుకున్నారు. ఆర్టికల్ 370​ రద్దుతో జమ్ముకశ్మీర్​కు రాష్ట్ర హోదా తప్పించిన అనంతరం అక్కడి నేతలతో గురువారం నిర్వహించే సమావేశం మొదటిది. కశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణపై చర్చించేందుకు.. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్ లోనె తదితరులను సమావేశానికి ప్రధాని మోదీ ఆహ్వానించారు.

సమావేశానికి హాజరయ్యే అంశంపై గుప్కార్ నేతలు​ మొదట తర్జనభర్జన పడ్డారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమై.. ప్రధానితో మాట్లాడటాల్సిన అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ప్రధానితో భేటీ అవుతామని ప్రకటించారు. ఆర్టికల్​ 370 పునరుద్ధరణపై తగ్గేది లేదని స్పష్టం చేశారు.

గుప్కార్​ ఏంటీ?

2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కీలక నేతల నిర్బంధం తర్వాత అక్కడి రాజకీయాలు స్తబ్దుగా సాగిపోయాయి. క్రమంగా కశ్మీర్​ ప్రయోజనాల కోసం అంటూ.. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఒకే గొడుగు కిందకు చేరారు. పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏడీజీ) పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి ఈ కూటమి ప్రధాన డిమాండ్లు.

ఇవీ చదవండి:

PM Modi: జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ!

ప్రత్యేక హోదాపై 'గుప్కార్' వెనక్కి తగ్గినట్లేనా?

'ప్రధాని మోదీతో భేటీకి 'గుప్కార్'​ సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.