ETV Bharat / bharat

ఈ యాప్స్​ వాడుతున్నారా.. అయితే మోసపోయినట్టే!

author img

By

Published : Jul 6, 2021, 10:48 AM IST

Updated : Jul 6, 2021, 11:34 AM IST

దేశంలో మరో భారీ సైబర్​ మోసం బయటపడింది. ఈసారి ఏకంగా రూ. 360కోట్లు చైనాకు అక్రమ మార్గంలో వెళ్లిపోయాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అర్జించవచ్చని ఆశ చూపి ప్రజలకు గాలం వేశారు హాంగ్​కాంగ్​, చైనాకు చెందిన సైబర్​ నేరగాళ్లు. వారి వలలో చిక్కిన ప్రజలు పెద్ద మొత్తంలో అప్పగించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

cyber crime
సైబర్​ క్రైమ్​

దేశంలో ఆన్​లైన్​ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి.. తాజాగా జరిగిన ఘటన, దాని తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఓ యాప్​ ద్వారా ప్రజలను మోసం చేసి సంపాదించిన రూ. 360కోట్లు అక్రమ మార్గంలో చైనాకు వెళ్లిపోయాయి.

భారత్​ టు చైనా...

హాంగ్​కాంగ్, చైనా​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కొందరు సైబర్​ నేరగాళ్లు.. భారతీయులను సులభంగా బుట్టలో వేసుకున్నారు. ఓ మొబైల్​ యాప్​ రూపొందించి.. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. అలా.. ఒక్క రోజులో కోట్ల రూపాయలు వారి ఖాతాలో వచ్చిచేరాయి. ఆ తర్వాత దాదాపు రూ. 360కోట్ల అక్రమ సొమ్ము దేశంలోని వివిధ ఆన్​లైన్​ మార్గాల ద్వారా చైనాకు వెళ్లింది. అక్కడి నుంచి 'పవర్​ బ్యాంక్​ యాప్​' ద్వారా అవి క్రిప్టోకరెన్సీలో చేరాయి.

ఈ వ్యవహారం అంతా ఉత్తరాఖండ్​ ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్​) దర్యాప్తులో బయటపడింది. చైనాకు ఈ అక్రమార్జన ఏ విధంగా వెళ్లిందనే విషయాన్ని దెహ్రాదూన్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్​లను గుర్తించారు.

హాంగ్​కాంగ్​ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఈ-వాలెట్​ పేటీఎమ్​, రేజర్​ పే ప్రతినిధులకు ఎస్​టీఎప్​ సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించి.. ఉత్తరాఖండ్​లోని ఇద్దరు కీలక నిందితులు, బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది.

అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. విదేశీయుల హస్తం ఉన్నందున సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి నేరాలను నిలువరించేందుకు జాతీయ స్థాయిలో సంస్కరణలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చూడండి:- పంథా మార్చిన సైబర్ క్రైమ్స్​- ఇలా జాగ్రత్తపడండి..

దేశంలో ఆన్​లైన్​ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి.. తాజాగా జరిగిన ఘటన, దాని తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఓ యాప్​ ద్వారా ప్రజలను మోసం చేసి సంపాదించిన రూ. 360కోట్లు అక్రమ మార్గంలో చైనాకు వెళ్లిపోయాయి.

భారత్​ టు చైనా...

హాంగ్​కాంగ్, చైనా​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కొందరు సైబర్​ నేరగాళ్లు.. భారతీయులను సులభంగా బుట్టలో వేసుకున్నారు. ఓ మొబైల్​ యాప్​ రూపొందించి.. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. అలా.. ఒక్క రోజులో కోట్ల రూపాయలు వారి ఖాతాలో వచ్చిచేరాయి. ఆ తర్వాత దాదాపు రూ. 360కోట్ల అక్రమ సొమ్ము దేశంలోని వివిధ ఆన్​లైన్​ మార్గాల ద్వారా చైనాకు వెళ్లింది. అక్కడి నుంచి 'పవర్​ బ్యాంక్​ యాప్​' ద్వారా అవి క్రిప్టోకరెన్సీలో చేరాయి.

ఈ వ్యవహారం అంతా ఉత్తరాఖండ్​ ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్​) దర్యాప్తులో బయటపడింది. చైనాకు ఈ అక్రమార్జన ఏ విధంగా వెళ్లిందనే విషయాన్ని దెహ్రాదూన్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్​లను గుర్తించారు.

హాంగ్​కాంగ్​ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఈ-వాలెట్​ పేటీఎమ్​, రేజర్​ పే ప్రతినిధులకు ఎస్​టీఎప్​ సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించి.. ఉత్తరాఖండ్​లోని ఇద్దరు కీలక నిందితులు, బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది.

అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. విదేశీయుల హస్తం ఉన్నందున సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి నేరాలను నిలువరించేందుకు జాతీయ స్థాయిలో సంస్కరణలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చూడండి:- పంథా మార్చిన సైబర్ క్రైమ్స్​- ఇలా జాగ్రత్తపడండి..

Last Updated : Jul 6, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.