ETV Bharat / bharat

'స్టిరాయిడ్ల దుర్వినియోగమే.. బ్లాక్​ ఫంగస్​కు​ కారణం'

స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే బ్లాక్​ ఫంగస్​ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా తెలిపారు. కొవిడ్​ రోగులకు చికిత్స అందించే విషయంలో.. ఆస్పత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. పలు రాష్ట్రాల్లో 500కు పైగా బ్లాక్ ఫంగస్​ కేసులు వెలుగు చూశాయని చెప్పారు.

author img

By

Published : May 15, 2021, 6:01 PM IST

Randeep Guleria
రణదీప్​ గులేరియా

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిని కలవరపెడుతున్న బ్లాక్​ ఫంగస్ (మ్యుకర్​మైకోసిస్)​​ వ్యాధికి స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే ప్రధాన కారణమని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా తెలిపారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్న తరుణంలో ​ఈ శిలీంధ్ర వ్యాధి కట్టడికి ఆస్పత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు.

"కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున బ్లాక్​ ఫంగస్​ వ్యాప్తి నియంత్రించేందుకు అన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించటం అత్యవసరం. ఈ వ్యాధి కారణంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. మ్యుకర్​మైకోసిస్​ అనే ఈ శిలీంధ్రం.. భూమిలో, మట్టిలో, మనం తినే ఆహారంలో కూడా ఉంటుంది. కానీ, అది ఇన్​ఫెక్షన్​ను కలిగించదు. కొవిడ్​కు ముందు ఈ ఫంగస్​ వల్ల ఇన్​ఫెక్షన్​ బారిన పడ్డ వారి సంఖ్య చాలా అరుదుగా ఉండేవి. కానీ, ప్రస్తుతం కొవిడ్ వల్ల ఈ శిలీంధ్ర వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.''

-రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ డైరెక్టర్​

"ముఖం, ముక్కు, కంటి వలయం, మెదడును బ్లాక్​ ఫంగస్​ దెబ్బ తీస్తుంది. దీని వల్ల కంటిచూపు కూడా కోల్పోతారు. ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం.. స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే. డయాబెటిక్ రోగులు ఈ ఫంగస్​ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ స్టిరాయిడ్లను అతిగా వినియోగించటం మానేయాలి" అని గులేరియా పేర్కొన్నారు.

ఎయిమ్స్​లో ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి 23 మంది చికిత్స పొందుతున్నారని గులేరియా తెలిపారు. వారిలో 20 మందికి ఇంకా కొవిడ్​ పాజిటివ్​గా ఉండగా.. మిగతా వారికి నెగెటివ్​గా తేలినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో 500 చొప్పున ఈ తరహా కేసులు వెలుగుచూశాయని చెప్పారు.

అంతకుముందు ఈ బ్లాక్​ఫంగస్​ను 'నోటిఫైడ్​ డిసీస్'​గా హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఈ వ్యాధిని పర్యవేక్షించేందుకుగానూ ఏడుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్​లో 12 మంది బ్లాక్​ ఫంగస్​ బారిన పడగా.. వారిలో ఇద్దరు చనిపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: బ్లాక్​ ఫంగస్​పై హర్షవర్ధన్​ కీలక సూచనలు

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిని కలవరపెడుతున్న బ్లాక్​ ఫంగస్ (మ్యుకర్​మైకోసిస్)​​ వ్యాధికి స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే ప్రధాన కారణమని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా తెలిపారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్న తరుణంలో ​ఈ శిలీంధ్ర వ్యాధి కట్టడికి ఆస్పత్రులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు.

"కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున బ్లాక్​ ఫంగస్​ వ్యాప్తి నియంత్రించేందుకు అన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించటం అత్యవసరం. ఈ వ్యాధి కారణంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. మ్యుకర్​మైకోసిస్​ అనే ఈ శిలీంధ్రం.. భూమిలో, మట్టిలో, మనం తినే ఆహారంలో కూడా ఉంటుంది. కానీ, అది ఇన్​ఫెక్షన్​ను కలిగించదు. కొవిడ్​కు ముందు ఈ ఫంగస్​ వల్ల ఇన్​ఫెక్షన్​ బారిన పడ్డ వారి సంఖ్య చాలా అరుదుగా ఉండేవి. కానీ, ప్రస్తుతం కొవిడ్ వల్ల ఈ శిలీంధ్ర వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.''

-రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ డైరెక్టర్​

"ముఖం, ముక్కు, కంటి వలయం, మెదడును బ్లాక్​ ఫంగస్​ దెబ్బ తీస్తుంది. దీని వల్ల కంటిచూపు కూడా కోల్పోతారు. ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం.. స్టిరాయిడ్లను అతిగా వినియోగించటమే. డయాబెటిక్ రోగులు ఈ ఫంగస్​ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ స్టిరాయిడ్లను అతిగా వినియోగించటం మానేయాలి" అని గులేరియా పేర్కొన్నారు.

ఎయిమ్స్​లో ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి 23 మంది చికిత్స పొందుతున్నారని గులేరియా తెలిపారు. వారిలో 20 మందికి ఇంకా కొవిడ్​ పాజిటివ్​గా ఉండగా.. మిగతా వారికి నెగెటివ్​గా తేలినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో 500 చొప్పున ఈ తరహా కేసులు వెలుగుచూశాయని చెప్పారు.

అంతకుముందు ఈ బ్లాక్​ఫంగస్​ను 'నోటిఫైడ్​ డిసీస్'​గా హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఈ వ్యాధిని పర్యవేక్షించేందుకుగానూ ఏడుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్​లో 12 మంది బ్లాక్​ ఫంగస్​ బారిన పడగా.. వారిలో ఇద్దరు చనిపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి: బ్లాక్​ ఫంగస్​పై హర్షవర్ధన్​ కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.