ETV Bharat / bharat

18వేల అడుగుల వైశాల్యంలో భవర్​లాల్​ చిత్రం

author img

By

Published : Feb 26, 2021, 11:02 AM IST

మహారాష్ట్రలోని జల్గావ్​కు చెందిన ఓ కళాకారుడు.. తమ కంపెనీ వ్యవస్థాపకునికి వినూత్న రీతిలో నివాళులర్పించారు. పారిశ్రామిక వేత్త భవర్​లాల్​ జైన్​ జయంతి సందర్భంగా 18వేల అడుగుల వైశాల్యంలో ఆయన చిత్రాన్ని రూపొందించారు. చూపరులను ఎంతగానో ఆకర్షించే ఈ చిత్రానికి గిన్నిస్​ బుక్​లో చోటు దక్కింది.

Mosaic portrait of Bhavarlal Jain recorded in Guinness Book
పైపులనే కుంచె చేసి.. అద్భుతమైన కళాఖండం నిర్మించి..

ప్రముఖ పారిశ్రామిక వేత్త భవర్​లాల్​ జైన్​ జయంతి సందర్భంగా.. ఆయనకు వినూత్నరీతిలో నివాళులర్పించారు ఓ కళాకారుడు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్​ భోస్లే.. 18వేల అడుగుల వైశాల్యంలో(150x120) జైన్​ రూపంలో మొజాయిక్​ కళాఖండాన్ని రూపొందించారు. జైన్​ పైప్స్​ వ్యవస్థాపకులైన భవర్​లాల్​​ చిత్రానికి.. అదే కంపెనీకి చెందిన పీఈ, పీవీసీ పైపులనే వినియోగించడం విశేషం. తెలుపు, నలుపు, బూడిద రంగులతో కలబోసి చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ మొజాయిక్​ చిత్రం.. గిన్నిస్​ రికార్డులో చోటు దక్కించుకుంది.

Mosaic portrait of Bhavarlal Jain recorded in Guinness Book
పైపులతో నిర్మించిన భవర్​లాల్​ జైన్​ చిత్రం

జైన్​ ఇరిగేషన్​ సహోద్యోగి అయిన భోస్లే.. ఈ అద్భుత కళాఖండాన్ని చిత్రించేందుకు 25 మెట్రిక్​ టన్నుల(8వేల) పీవీసీ పైపులను ఉపయోగించారట. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 14 గంటల శ్రమించినట్టు సమాచారం. అంటే మొత్తంగా 98 గంటల సమయాన్ని వెచ్చించారన్నమాట. ఈ కళాఖండానికి వాడిన మొత్తం పైపులను తీసి విడిగా అమర్చితే దాని పొడవే 21.9 కిలోమీటర్లు ఉంటుందట.

ఇదీ చదవండి: 'ఖేలో ఇండియా​'కు ముందు స్కైయర్ల విన్యాసాలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త భవర్​లాల్​ జైన్​ జయంతి సందర్భంగా.. ఆయనకు వినూత్నరీతిలో నివాళులర్పించారు ఓ కళాకారుడు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్​ భోస్లే.. 18వేల అడుగుల వైశాల్యంలో(150x120) జైన్​ రూపంలో మొజాయిక్​ కళాఖండాన్ని రూపొందించారు. జైన్​ పైప్స్​ వ్యవస్థాపకులైన భవర్​లాల్​​ చిత్రానికి.. అదే కంపెనీకి చెందిన పీఈ, పీవీసీ పైపులనే వినియోగించడం విశేషం. తెలుపు, నలుపు, బూడిద రంగులతో కలబోసి చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ మొజాయిక్​ చిత్రం.. గిన్నిస్​ రికార్డులో చోటు దక్కించుకుంది.

Mosaic portrait of Bhavarlal Jain recorded in Guinness Book
పైపులతో నిర్మించిన భవర్​లాల్​ జైన్​ చిత్రం

జైన్​ ఇరిగేషన్​ సహోద్యోగి అయిన భోస్లే.. ఈ అద్భుత కళాఖండాన్ని చిత్రించేందుకు 25 మెట్రిక్​ టన్నుల(8వేల) పీవీసీ పైపులను ఉపయోగించారట. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 14 గంటల శ్రమించినట్టు సమాచారం. అంటే మొత్తంగా 98 గంటల సమయాన్ని వెచ్చించారన్నమాట. ఈ కళాఖండానికి వాడిన మొత్తం పైపులను తీసి విడిగా అమర్చితే దాని పొడవే 21.9 కిలోమీటర్లు ఉంటుందట.

ఇదీ చదవండి: 'ఖేలో ఇండియా​'కు ముందు స్కైయర్ల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.