ETV Bharat / bharat

కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే  మృతి - JDU MLA Mewalal Choudhary dead news

బిహార్​లో కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి మరణించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ చనిపోయారు.

Mewalal Choudhary, JDU MLA
మేవలాల్ చౌదరి, జేడీయూ ఎమ్మెల్యే
author img

By

Published : Apr 19, 2021, 8:09 AM IST

Updated : Apr 19, 2021, 11:20 AM IST

కరోనాతో ఇప్పటికే పలువురు నేతలు మృతి చెందగా.. తాజాగా బిహార్​లోని జేడీయూ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి మరణించారు. పట్నాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

గతవారం మేవలాల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు పారస్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి.. సోమవారం ఉదయం 4 గంటలకు మరణించిట్లు అధికారులు వెల్లడించారు.

తారాపుర్​ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేవలాల్​.. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. అయితే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా పదవి నుంచి తొలగించారు.

ఇదీ చూడండి: 'కరోనా‌ కట్టడికి మిలటరీ కావాలి'

కరోనాతో ఇప్పటికే పలువురు నేతలు మృతి చెందగా.. తాజాగా బిహార్​లోని జేడీయూ ఎమ్మెల్యే మేవలాల్ చౌదరి మరణించారు. పట్నాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

గతవారం మేవలాల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు పారస్ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించి.. సోమవారం ఉదయం 4 గంటలకు మరణించిట్లు అధికారులు వెల్లడించారు.

తారాపుర్​ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేవలాల్​.. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. అయితే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా పదవి నుంచి తొలగించారు.

ఇదీ చూడండి: 'కరోనా‌ కట్టడికి మిలటరీ కావాలి'

Last Updated : Apr 19, 2021, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.