ETV Bharat / bharat

ఉగ్రదాడి కుట్ర భగ్నం- 7 కిలోల ఐఈడీ స్వాధీనం

author img

By

Published : Feb 14, 2021, 2:45 PM IST

Updated : Feb 14, 2021, 2:53 PM IST

జమ్ము కశ్మీర్​లో భారీ పేలుడును నివారించాయి భద్రతా దళాలు. ఏడు కిలోల ఐఈడీని గుర్తించి, స్వాధీనం చేసుకున్నాయి.

Major tragedy averted as 7-kg IED is detected near Jammu bus stand
జమ్ములో భారీ దాడికి యత్నం- ఏడు కిలోల ఐఈడీ

పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన నేపథ్యంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము కశ్మీర్​లోని ఓ బస్టాప్​లో భారీ స్థాయిలో ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి. ప్రజలతో కిక్కిరిసిపోయిన జమ్ము బస్టాండ్​లో ఏడు కిలోల ఐఈడీని గుర్తించాయి.

ఐఈడీ గురించి నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇటీవల జమ్ము కశ్మీర్​లో ఇద్దరు కీలక ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి యత్నం జరగడం గమనార్హం.

రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్​పీఎఫ్ కాన్వాయ్​పై పుల్వామాలో దాడి జరిగింది. పాక్ ప్రేరేపిత జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

ఇదీ చదవండి: పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి

పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన నేపథ్యంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము కశ్మీర్​లోని ఓ బస్టాప్​లో భారీ స్థాయిలో ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి. ప్రజలతో కిక్కిరిసిపోయిన జమ్ము బస్టాండ్​లో ఏడు కిలోల ఐఈడీని గుర్తించాయి.

ఐఈడీ గురించి నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇటీవల జమ్ము కశ్మీర్​లో ఇద్దరు కీలక ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి యత్నం జరగడం గమనార్హం.

రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్​పీఎఫ్ కాన్వాయ్​పై పుల్వామాలో దాడి జరిగింది. పాక్ ప్రేరేపిత జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

ఇదీ చదవండి: పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి

Last Updated : Feb 14, 2021, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.