ETV Bharat / bharat

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి - జోధ్​పుర్​లో రోడ్డు ప్రమాదం

जोधपुर में गुरुवार देर रात हुई सड़क दुर्घटना (Road Accident in Jodhpur) में एक ही परिवार के 6 लोगों की मौत हो गई. हादसे में तीन लोग घायल हो गए, जिनका मथुरादास माथुर अस्पताल में उपचार जारी है. बता दें, चूरू निवासी परिवार नागाणा कुल देवी के दर्शन के लिए जा रहा था.

major-road-accident-in-jodhpur-truck-and-car-collision
major-road-accident-in-jodhpur-truck-and-car-collision
author img

By

Published : Apr 15, 2022, 8:38 AM IST

Updated : Apr 15, 2022, 9:20 AM IST

08:29 April 15

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

Jodhpur Accident: రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో- ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చురూ నుంచి కారులో.. దైవదర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో అర్ధరాత్రి సుమారు ఒంటిగంటకు ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కు వెనక భాగాన్ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతులు.. విజయ్​ సింగ్​, ఉదయ్​ ప్రతాప్ సింగ్, మంజూ కన్వర్, ప్రవీణ సింగ్, దర్పన్​ సింగ్, మధుకన్వర్​ సింగ్​లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ముగ్గురిలో చైన్​ సింగ్​ అనే వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పవన్​ సింగ్, సంజూ కన్వర్​ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జోధ్​పుర్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 22 ఏళ్లుగా గదిలో బందీగా మహిళ.. కుటుంబసభ్యులే కట్టేసి..

08:29 April 15

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

Jodhpur Accident: రాజస్థాన్​ జోధ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో- ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చురూ నుంచి కారులో.. దైవదర్శనానికి వెళ్తుండగా జోధ్​పుర్​- జైపుర్​ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో అర్ధరాత్రి సుమారు ఒంటిగంటకు ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కు వెనక భాగాన్ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతులు.. విజయ్​ సింగ్​, ఉదయ్​ ప్రతాప్ సింగ్, మంజూ కన్వర్, ప్రవీణ సింగ్, దర్పన్​ సింగ్, మధుకన్వర్​ సింగ్​లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ముగ్గురిలో చైన్​ సింగ్​ అనే వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పవన్​ సింగ్, సంజూ కన్వర్​ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జోధ్​పుర్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 22 ఏళ్లుగా గదిలో బందీగా మహిళ.. కుటుంబసభ్యులే కట్టేసి..

Last Updated : Apr 15, 2022, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.