ETV Bharat / bharat

విజృంభిస్తోన్న కరోనా- మహారాష్ట్రలో 60వేల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 60,212 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 18,021 మందికి కొవిడ్​ సోకింది.

author img

By

Published : Apr 13, 2021, 10:32 PM IST

Maharashtra sees 60,212 new COVID-19 cases, 281 die
దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా-మహాలో కఠిన ఆంక్షలు

మహారాష్ట్రలో తాజాగా 60,212 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 35,19,208కి చేరింది. మరో 281 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,93,042 యాక్టివ్​ కేసులున్నాయి. పెరుగుతోన్న కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రప్రభుత్వం 15 రోజుల కర్ఫ్యూని విధించింది.

యూపీలో విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 18,021 కేసులు వెలుగుచూశాయి. మరో 85 మంది చనిపోయారు.

దిల్లీలో..

దిల్లీలో ఒక్కరోజే 13,468 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,50,156కు చేరింది. మరో 81మంది మృతి చెందారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 8,778 మంది వైరస్​ బారిన పడగా.. 67 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,83,647కు చేరింది.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 18 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 47వేలకు చేరింది.

కేరళలో ఇలా...

కేరళలో మరో 7,000 కేసులు బయటపడ్డాయి. తాజాగా 20 మంది కరోనాతో మరణించారు.

ప్రముఖుల కరోనా సమాచారం

  • యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ హోం క్వారెంటైన్​కు పరిమితం అయ్యారు. తన చుట్టూ ఉండే అధికారుల్లో కొంతమందికి వైరస్​ నిర్ధరణ కావడం వల్ల ఇలా చేసినట్లు తెలిపారు.
  • కేంద్ర మంత్రి సంతోశ్​ గంగ్వార్​ కరోనా బారిన పడ్డారు.
  • భాజపా రాజ్యసభ సభ్యుడు అనిల్​ బలూనికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రం తాజా కేసులు మరణాలు
బంగాల్ 4,817 20
గుజరాత్ 6,69067
పంజాబ్ 3,84553
హరియాణా 3,818 16
రాజస్థాన్ 5,528 28

మహారాష్ట్రలో తాజాగా 60,212 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 35,19,208కి చేరింది. మరో 281 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,93,042 యాక్టివ్​ కేసులున్నాయి. పెరుగుతోన్న కేసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రప్రభుత్వం 15 రోజుల కర్ఫ్యూని విధించింది.

యూపీలో విజృంభణ

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 18,021 కేసులు వెలుగుచూశాయి. మరో 85 మంది చనిపోయారు.

దిల్లీలో..

దిల్లీలో ఒక్కరోజే 13,468 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,50,156కు చేరింది. మరో 81మంది మృతి చెందారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొత్తగా 8,778 మంది వైరస్​ బారిన పడగా.. 67 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,83,647కు చేరింది.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 18 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 47వేలకు చేరింది.

కేరళలో ఇలా...

కేరళలో మరో 7,000 కేసులు బయటపడ్డాయి. తాజాగా 20 మంది కరోనాతో మరణించారు.

ప్రముఖుల కరోనా సమాచారం

  • యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ హోం క్వారెంటైన్​కు పరిమితం అయ్యారు. తన చుట్టూ ఉండే అధికారుల్లో కొంతమందికి వైరస్​ నిర్ధరణ కావడం వల్ల ఇలా చేసినట్లు తెలిపారు.
  • కేంద్ర మంత్రి సంతోశ్​ గంగ్వార్​ కరోనా బారిన పడ్డారు.
  • భాజపా రాజ్యసభ సభ్యుడు అనిల్​ బలూనికి కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రం తాజా కేసులు మరణాలు
బంగాల్ 4,817 20
గుజరాత్ 6,69067
పంజాబ్ 3,84553
హరియాణా 3,818 16
రాజస్థాన్ 5,528 28
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.