ETV Bharat / bharat

ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్​.. ఇదే తొలిసారి!

author img

By

Published : Mar 3, 2022, 1:30 PM IST

Maha Governor Koshyari: మహారాష్ట్ర విధానసభలో గురువారం గందరగోళం నెలకొంది. బడ్జెట్​ సెషన్​కు ముందు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయారు గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ. అనంతరం.. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.

Maha Governor Koshyari
Maha Governor Koshyari

Maha Governor Koshyari: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఊహించని సంఘటనలు జరిగాయి. బడ్జెట్​ సెషన్​కు ముందు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. మధ్యలోనే ముగించారు. చట్టసభ్యుల నినాదాల నడుమ ఆయన విధాన్​ భవన్​ సెంట్రల్​ హాల్​ నుంచి బయటకు వెళ్లిపోయారు.

  • #WATCH | Maharashtra Governor Bhagat Singh Koshyari leaves his speech midway & leaves from Assembly on the first day of session, as Maha Vikas Aghadi MLAs shout slogans in the House

    The Governor had allegedly made controversial statement over Chhatrapati Shivaji Maharaj recently pic.twitter.com/ofG1tNGhyD

    — ANI (@ANI) March 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది..

గవర్నర్​ సెంట్రల్​ హాల్​లోకి రాగానే.. మహా వికాస్​ అఘాడీ చట్టసభ్యులు కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విపక్ష భాజపా.. అధికార పక్షంపై విమర్శలకు దిగింది. దావూద్​ ఇబ్రహీం మనీలాండరింగ్​ కేసులో.. ఇటీవల అరెస్టైన ఎన్​సీపీ నేత, రాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్​ చేసింది.

దీంతో ఇరువర్గాల వాగ్వాదం నడుమ.. గవర్నర్​ వెళ్లిపోయారని చెప్పారు మహారాష్ట్ర ఎన్​సీపీ అధ్యక్షుడు జయంత్​ పాటిల్​. జాతీయ గీతం కోసం వేచిచూడకుండా వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

అదే కారణం!

గవర్నర్​ ఇటీవల ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రసంగిస్తున్న సమయంలో కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధికార కూటమి నేతలు. ​

దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్​, పద్మభూషణ్​ గ్రహీత, వ్యాపారవేత్త రాహుల్​ బజాజ్​ మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే ఉభయ సభలు మార్చి 4కు వాయిదాపడ్డాయి.

అనంతరం.. మహా వికాస్​ అఘాడీ నేతలు సెంట్రల్​ హాల్​ బయట గవర్నర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్​సీపీ ఎమ్మెల్యే సంజయ్​ దౌండ్​ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు.

ఇవీ చూడండి: బంగాల్ స్థానికంలో టీఎంసీ హవా.. ఖాతా తెరవని భాజపా

ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్

Maha Governor Koshyari: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం ఊహించని సంఘటనలు జరిగాయి. బడ్జెట్​ సెషన్​కు ముందు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ.. మధ్యలోనే ముగించారు. చట్టసభ్యుల నినాదాల నడుమ ఆయన విధాన్​ భవన్​ సెంట్రల్​ హాల్​ నుంచి బయటకు వెళ్లిపోయారు.

  • #WATCH | Maharashtra Governor Bhagat Singh Koshyari leaves his speech midway & leaves from Assembly on the first day of session, as Maha Vikas Aghadi MLAs shout slogans in the House

    The Governor had allegedly made controversial statement over Chhatrapati Shivaji Maharaj recently pic.twitter.com/ofG1tNGhyD

    — ANI (@ANI) March 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ జరిగింది..

గవర్నర్​ సెంట్రల్​ హాల్​లోకి రాగానే.. మహా వికాస్​ అఘాడీ చట్టసభ్యులు కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విపక్ష భాజపా.. అధికార పక్షంపై విమర్శలకు దిగింది. దావూద్​ ఇబ్రహీం మనీలాండరింగ్​ కేసులో.. ఇటీవల అరెస్టైన ఎన్​సీపీ నేత, రాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్​ చేసింది.

దీంతో ఇరువర్గాల వాగ్వాదం నడుమ.. గవర్నర్​ వెళ్లిపోయారని చెప్పారు మహారాష్ట్ర ఎన్​సీపీ అధ్యక్షుడు జయంత్​ పాటిల్​. జాతీయ గీతం కోసం వేచిచూడకుండా వెళ్లారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

అదే కారణం!

గవర్నర్​ ఇటీవల ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రసంగిస్తున్న సమయంలో కోశ్యారీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధికార కూటమి నేతలు. ​

దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్​, పద్మభూషణ్​ గ్రహీత, వ్యాపారవేత్త రాహుల్​ బజాజ్​ మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే ఉభయ సభలు మార్చి 4కు వాయిదాపడ్డాయి.

అనంతరం.. మహా వికాస్​ అఘాడీ నేతలు సెంట్రల్​ హాల్​ బయట గవర్నర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్​సీపీ ఎమ్మెల్యే సంజయ్​ దౌండ్​ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు.

ఇవీ చూడండి: బంగాల్ స్థానికంలో టీఎంసీ హవా.. ఖాతా తెరవని భాజపా

ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.