ETV Bharat / bharat

వృద్ధురాలు మృతి- పోలీసులపై గ్రామస్థుల దాడి

పోలీసుల తన్నగా వృద్ధురాలు మృతి చెందిందని ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. పోలీసులపై దాడి చేశారు. బిహార్​లోని మొతిహరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

attack police
మహిళ మృతి- పోలీసులపై గ్రామస్థుల దాడి
author img

By

Published : Apr 22, 2021, 8:10 PM IST

బిహార్​లోని మొతిహరి జిల్లాలోని ఓ గ్రాామానికి చెందిన ప్రజలు రెచ్చిపోయారు. పోలీసులు కాలితో తన్నగా తమ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహానికి లోనైన వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కోతావా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నాయకటోలా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. కొంత మంది పోలీసులు గాయపడ్డారు.

attack police
పోలీసులపై గ్రామస్థుల దాడి
attack police
పోలీసులపై గ్రామస్థుల దాడి
పోలీసులపై గ్రామస్థుల దాడి

మరణించిన వృద్ధురాలిని సుశీలా దేవిగా అధికారులు గుర్తించారు. పోలీసులపై ఆమె చిన్న కుమారుడు చోటేలాల్​ యాదవ్​ ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వం చేశారన్న ఆరోపణలతో.. ఎస్​హెచ్​ఓ నితిన్​ కుమార్​ నేతృత్వంలోని బృందం సోదాలు నిర్వహించిందని విలేకరుల సమావేశంలో తెలిపాడు.

"పోలీసులు వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇంట్లోనే ఉన్నాం. వారిని ఇంట్లోకి వెళ్లవద్దని మా అమ్మ చెప్పింది. అప్పుడు.. ఓ పోలీసు ఆమెను కాలితో తన్నాడు. దాంతో.. కిందపడిన మా అమ్మ అక్కడికక్కడే మరణించింది."

-చోటేలాల్​ యాదవ్​.

దాడి సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనాస్థలానికి తూర్పు చంపారన్​ ఎస్​పీ చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కరోనాతో తల్లి మృతి- బాధతో కుమార్తె ఆత్మహత్య!

ఇదీ చూడండి: 'ఆక్సిజన్​ లీకేజీ' ఘటనలో వారిపై కేసు

బిహార్​లోని మొతిహరి జిల్లాలోని ఓ గ్రాామానికి చెందిన ప్రజలు రెచ్చిపోయారు. పోలీసులు కాలితో తన్నగా తమ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహానికి లోనైన వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కోతావా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నాయకటోలా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. కొంత మంది పోలీసులు గాయపడ్డారు.

attack police
పోలీసులపై గ్రామస్థుల దాడి
attack police
పోలీసులపై గ్రామస్థుల దాడి
పోలీసులపై గ్రామస్థుల దాడి

మరణించిన వృద్ధురాలిని సుశీలా దేవిగా అధికారులు గుర్తించారు. పోలీసులపై ఆమె చిన్న కుమారుడు చోటేలాల్​ యాదవ్​ ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వం చేశారన్న ఆరోపణలతో.. ఎస్​హెచ్​ఓ నితిన్​ కుమార్​ నేతృత్వంలోని బృందం సోదాలు నిర్వహించిందని విలేకరుల సమావేశంలో తెలిపాడు.

"పోలీసులు వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇంట్లోనే ఉన్నాం. వారిని ఇంట్లోకి వెళ్లవద్దని మా అమ్మ చెప్పింది. అప్పుడు.. ఓ పోలీసు ఆమెను కాలితో తన్నాడు. దాంతో.. కిందపడిన మా అమ్మ అక్కడికక్కడే మరణించింది."

-చోటేలాల్​ యాదవ్​.

దాడి సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనాస్థలానికి తూర్పు చంపారన్​ ఎస్​పీ చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కరోనాతో తల్లి మృతి- బాధతో కుమార్తె ఆత్మహత్య!

ఇదీ చూడండి: 'ఆక్సిజన్​ లీకేజీ' ఘటనలో వారిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.