దేశంలో సింహాలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని ఇటావా సఫారీ పార్కులో ఓ సింహానికి వైరస్ సోకింది. మరో సింహానికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
"ఇటావా సఫారీ పార్కులోని 14 ఏసియాటిక్ సింహాల శాంపిల్స్ సేకరించి భారత పశువైద్య పరిశోధన సంస్థ(ఐవీఆర్ఐ)కి పంపించాం. ఒక సింహానికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మరో సింహానికి లక్షణాలు ఉన్నాయి. మిగతా 12 సింహాలకు నెగెటివ్ వచ్చింది."
-- డాక్టర్. కేపీ సింగ్, సఫారీ పార్కు జాయింట్ డైరెక్టర్
హైదరాబాద్లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఈనెల 4న ఎనిమిది సింహాలు కరోనా బారినపడ్డాయి.
ఇదీ చదవండి : భద్రతా దళాలపై గ్రనేడ్లు విసిరిన ఉగ్రవాదులు