ETV Bharat / bharat

KRMB Meeting in Hyderabad : హైదరాబాద్​ జలసౌధలో కేఆర్​ఎంబీ సమావేశం

author img

By

Published : May 10, 2023, 6:51 AM IST

Updated : May 10, 2023, 12:24 PM IST

KRMB Meeting in Hyderabad Today : రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో కేటాయింపులు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అనుమతులు, పరస్పర ఫిర్యాదులపై నదీ యాజమాన్య బోర్డులో చర్చ ప్రారంభమైంది. జల విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి లెక్కింపు, ఆర్డీఎస్, తదితర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. బడ్జెట్ సంబంధిత అంశాలు, రాష్ట్రాల నుంచి బోర్డుకు నిధుల అంశం కూడా చర్చకు రానుంది.

KRMB
KRMB

KRMB Meeting in Hyderabad Today : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్​ఎంబీ ఛైర్మన్ నందన్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. సమావేశం కోసం భారీ ఎజెండా సిద్ధమైంది. బోర్డుతో పాటు రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన మొత్తం 21 అంశాలను ఎజెండాలో పొందపరిచారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకం ప్రధాన అంశంగా ఉంది.

సమావేశంలో చర్చకు రానున్న ప్రధానాంశాలివే : గతం నుంచి కొనసాగుతున్నట్లుగానే 811 టీఎంసీలను 66:34 నిష్పత్తిలో పంచాలని ఏపీ అంటోండగా.. అది తమకు ఆమోదయోగ్యం కాదని.. చెరి సగం వాటా ఉండాలని తెలంగాణ అంటోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, ఉమ్మడి కాంపోనెంట్లను బోర్డుకు స్వాధీనం చేయడం, అనుమతుల్లేని ప్రాజెక్టుల అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు బోర్డు బడ్జెట్, కేఆర్​ఎంబీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అదనపు అలవెన్స్ రికవరీ, సంబంధిత అంశాలు కూడా చర్చకు రానున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడం లేదంటున్న బోర్డు... కార్యకలాపాలు సజావుగా సాగాలంటే జూన్‌లోగా నిధులు విడుదల చేయాలని కోరుతోంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, రాజభాష హిందీ అమలు, అందుకోసం అవసరమైతే అనువాదకుల నియామకం అంశం కూడా ఎజెండాలో ఉన్నాయి.

తెలంగాణ, ఏపీ ప్రతిపాదించనున్న అంశాలివే : తాగునీటి కోసం వినియోగించిన నీటిని 20 శాతంగానే లెక్కింపు, పోతిరెడ్డిపాడు సహా ఎస్​ఆర్​ఎంసీ రెగ్యులేటర్లపై టెలిమెట్రీ ఏర్పాటు, ఆర్డీఎస్ ఆధునీకీకరణ, అనుమతుల్లేకుండా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టడం... బోర్డులో మూడో సభ్యుని నియామకం అంశాలపై చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. శ్రీశైలం - నాగార్జున సాగర్ నుంచి అనుమతి లేకుండా జలవిద్యుత్ ఉత్పత్తి, ఆర్​ఎంసీ సిఫారసుల అమలు, అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల ఇన్ టేక్ వెల్, పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్​పై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. చిన్న నీటివనరుల ద్వారా తెలంగాణ ఎక్కువ నీటి వినియోగం, గోదావరి నుంచి మళ్లింపుతో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ నష్టాలు, వరద సమయంలో వినియోగించిన నీటి వినియోగం అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

KRMB Meeting in Hyderabad Today : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 17వ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్​ఎంబీ ఛైర్మన్ నందన్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. సమావేశం కోసం భారీ ఎజెండా సిద్ధమైంది. బోర్డుతో పాటు రెండు రాష్ట్రాలు ప్రతిపాదించిన మొత్తం 21 అంశాలను ఎజెండాలో పొందపరిచారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకం ప్రధాన అంశంగా ఉంది.

సమావేశంలో చర్చకు రానున్న ప్రధానాంశాలివే : గతం నుంచి కొనసాగుతున్నట్లుగానే 811 టీఎంసీలను 66:34 నిష్పత్తిలో పంచాలని ఏపీ అంటోండగా.. అది తమకు ఆమోదయోగ్యం కాదని.. చెరి సగం వాటా ఉండాలని తెలంగాణ అంటోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు, ఉమ్మడి కాంపోనెంట్లను బోర్డుకు స్వాధీనం చేయడం, అనుమతుల్లేని ప్రాజెక్టుల అంశం కూడా చర్చకు రానుంది. దీంతో పాటు బోర్డు బడ్జెట్, కేఆర్​ఎంబీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అదనపు అలవెన్స్ రికవరీ, సంబంధిత అంశాలు కూడా చర్చకు రానున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడం లేదంటున్న బోర్డు... కార్యకలాపాలు సజావుగా సాగాలంటే జూన్‌లోగా నిధులు విడుదల చేయాలని కోరుతోంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, రాజభాష హిందీ అమలు, అందుకోసం అవసరమైతే అనువాదకుల నియామకం అంశం కూడా ఎజెండాలో ఉన్నాయి.

తెలంగాణ, ఏపీ ప్రతిపాదించనున్న అంశాలివే : తాగునీటి కోసం వినియోగించిన నీటిని 20 శాతంగానే లెక్కింపు, పోతిరెడ్డిపాడు సహా ఎస్​ఆర్​ఎంసీ రెగ్యులేటర్లపై టెలిమెట్రీ ఏర్పాటు, ఆర్డీఎస్ ఆధునీకీకరణ, అనుమతుల్లేకుండా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఏపీ చేపట్టడం... బోర్డులో మూడో సభ్యుని నియామకం అంశాలపై చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించింది. శ్రీశైలం - నాగార్జున సాగర్ నుంచి అనుమతి లేకుండా జలవిద్యుత్ ఉత్పత్తి, ఆర్​ఎంసీ సిఫారసుల అమలు, అనుమతుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సుంకిశాల ఇన్ టేక్ వెల్, పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్​పై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. చిన్న నీటివనరుల ద్వారా తెలంగాణ ఎక్కువ నీటి వినియోగం, గోదావరి నుంచి మళ్లింపుతో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ నష్టాలు, వరద సమయంలో వినియోగించిన నీటి వినియోగం అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.