కేరళకు చెందిన ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టి ఇంధన రేట్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్ నుంచి ఏకంగా.. నేపాల్కు సైకిల్పై బయల్దేరారు అఖిలేశ్.
కోజికోడ్ టు నేపాల్..
కోజికోడ్ జిల్లా వేల్లిమడుకున్ను పూలక్కడవుకు చెందిన అఖిలేశ్.. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. దేశంలో ఇంధన రేట్లు పెరడటంపై ఆయన ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఇలా సైకిలెక్కి నిరసన బాటపట్టారు. నిరసన అనేది కేవలం రాజకీయ నాయకులు, పార్టీలకే కాదని.. ప్రతి పౌరుడి బాధ్యత అనే సందేశమిచ్చేందుకే ఇలా చేస్తున్నానని చెప్పారు అఖిలేశ్.
కాసరగోడ్లో ఘన స్వాగతం..
సుదీర్ఘ యాత్ర కోసం ఓ పాత సైకిల్ను సేకరించి.. దానికి మరమ్మతులు చేయించారు అఖిలేశ్. కోజికోడ్లో ఆయన యాత్ర ప్రారంభమవ్వగా.. గత శుక్రవారం కాసరగోడ్కు చేరుకున్నారు. అక్కడివారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అల్పాహారం, శీతలపానీయాలు ఇచ్చి ఆత్మీయంగా పలకరించారు. మరికొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత.. కాసరగోడ్ నుంచి తన సైకిల్ యాత్రను కొనసాగించారు అఖిలేశ్.
ఇదీ చదవండి: ఆయుధాలతో బెదిరించి.. రూ.1.25 కోట్లు దోచేశారు