ETV Bharat / bharat

రైతు నిరసనల ప్రాంతంలో దారుణ హత్య.. అర్ధనగ్నంగా మృతదేహం

author img

By

Published : Oct 15, 2021, 11:36 AM IST

అన్నదాతలు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం చేయి నరికేసి, అర్ధ నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బారికేడ్లకు వేలాడుతూ కనిపించింది. సాగు చట్టాల రద్దు కోరుతూ గత కొన్నాళ్లుగా రైతులు ఈ సరిహద్దు వేదికగా నిరసనలు చేపడుతున్నారు.

Singhu border
సింఘు సరిహద్దు

రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు దుండగులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అన్నదాతల నిరసనల ప్రధాన వేదికకు దగ్గరలో ఈ మృతదేహం వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. 'పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఒక చేతిని మణికట్టు వరకు నరికేశారు' అని పోలీసులు తెలిపారు.

మరోవైపు.. ఆ వ్యక్తి ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశాడని కొందరు ఆరోపించారు. అయితే ఇది అధికారికంగా నిర్ధరణ కావాల్సి ఉంది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకిస్తూ.. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు గత నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిరసనలు ఒక్కోసారి హింసాత్మకం అవుతున్నాయి. అక్టోబర్ 3న ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేస్తున్న వారిపై వాహనాలను నడిపిన ఘటనలో రైతులు సహా.. ఎనిమిది మంది మరణించారు. ఆ కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిరసనల్లో భాగంగా ఇప్పటివరకు 630 మంది కర్షకులు మరణించారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు దుండగులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అన్నదాతల నిరసనల ప్రధాన వేదికకు దగ్గరలో ఈ మృతదేహం వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. 'పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఒక చేతిని మణికట్టు వరకు నరికేశారు' అని పోలీసులు తెలిపారు.

మరోవైపు.. ఆ వ్యక్తి ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశాడని కొందరు ఆరోపించారు. అయితే ఇది అధికారికంగా నిర్ధరణ కావాల్సి ఉంది.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకిస్తూ.. దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు గత నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిరసనలు ఒక్కోసారి హింసాత్మకం అవుతున్నాయి. అక్టోబర్ 3న ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో నిరసన చేస్తున్న వారిపై వాహనాలను నడిపిన ఘటనలో రైతులు సహా.. ఎనిమిది మంది మరణించారు. ఆ కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిరసనల్లో భాగంగా ఇప్పటివరకు 630 మంది కర్షకులు మరణించారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.