ETV Bharat / bharat

ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

author img

By

Published : Nov 30, 2021, 11:49 AM IST

కేరళకు చెందిన ఓ ఆటోవాలా కూతురు చదువులో సత్తా చాటింది. రాయ​చూర్ అగ్రికల్ఛరల్​ యూనివర్సిటీలో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించింది. గవర్నర్​ చేతుల మీదుగా వీటిని అందుకుంది(kerala auto driver daughter).

Auto driver's daughter, ఆటోవాలా కూతురు
ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

కర్ణాటక రాయచూర్​ అగ్రికల్చరల్​ యూనివర్సిటీలో కేరళకు చెందిన గీత టి.వి. ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటింది. స్నాతకోత్సవంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ చేతులమీదుగా ఈ మెడల్స్ అందుకుంది. ఈమె సొంతూరు మలప్పురం జిల్లా వాండూర్​ గ్రామం. తండ్రి కే సురేశ్ కుమార్ ఓ సాధారణ ఆటోడ్రైవర్. తల్లి గృహిణి (kerala auto driver daughter).

Auto driver's daughter, ఆటోవాలా కూతురు
ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

ఈ స్నాతకోత్సవంలో మొత్తం 303 మంది డిగ్రీ విద్యార్థులు, 107 పీజీ, 26 పీహెచ్​డీ విద్యార్థులు పట్టాలు పొందారు. వీరిలో డిగ్రీలో 21 మంది, పీజీలో 14 మంది, పీహెచ్​డీలో 10 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరందరికీ గవర్నర్ మెడల్స్​ ప్రదానం చేశారు.

అనంతరం ఈటీవీ భారత్​తో మాట్లాడింది గీత. తాను కేరళకు చెందిన విద్యారినిని అయినప్పటికీ కర్ణాటకలో చదువుకున్నానని చెప్పింది. ఉపాధ్యాయులు, స్నేహితుల నుంచి గొప్ప సహకారం లభించిందని, వారి మద్దతుతోనే ఈ మెడల్స్ సాధించినట్లు పేర్కొంది. తల్లిదండ్రులు ఎల్లవేళలా అండగా నిలిచారని వారికి కృతజ్ఞతలు చెప్పింది(Auto driver daughter news).

Auto driver's daughter, ఆటోవాలా కూతురు
ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

పీహెచ్​డీ పూర్తి చేసి అగ్రికల్చర్ కాలేజ్​లో లెక్చరర్​ కావడమే తన లక్ష్యమని గీత చెప్పింది.

ఇదీ చదవండి: బుల్​ ఫెస్టివల్​లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..

కర్ణాటక రాయచూర్​ అగ్రికల్చరల్​ యూనివర్సిటీలో కేరళకు చెందిన గీత టి.వి. ఆరు గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటింది. స్నాతకోత్సవంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ చేతులమీదుగా ఈ మెడల్స్ అందుకుంది. ఈమె సొంతూరు మలప్పురం జిల్లా వాండూర్​ గ్రామం. తండ్రి కే సురేశ్ కుమార్ ఓ సాధారణ ఆటోడ్రైవర్. తల్లి గృహిణి (kerala auto driver daughter).

Auto driver's daughter, ఆటోవాలా కూతురు
ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

ఈ స్నాతకోత్సవంలో మొత్తం 303 మంది డిగ్రీ విద్యార్థులు, 107 పీజీ, 26 పీహెచ్​డీ విద్యార్థులు పట్టాలు పొందారు. వీరిలో డిగ్రీలో 21 మంది, పీజీలో 14 మంది, పీహెచ్​డీలో 10 మంది గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరందరికీ గవర్నర్ మెడల్స్​ ప్రదానం చేశారు.

అనంతరం ఈటీవీ భారత్​తో మాట్లాడింది గీత. తాను కేరళకు చెందిన విద్యారినిని అయినప్పటికీ కర్ణాటకలో చదువుకున్నానని చెప్పింది. ఉపాధ్యాయులు, స్నేహితుల నుంచి గొప్ప సహకారం లభించిందని, వారి మద్దతుతోనే ఈ మెడల్స్ సాధించినట్లు పేర్కొంది. తల్లిదండ్రులు ఎల్లవేళలా అండగా నిలిచారని వారికి కృతజ్ఞతలు చెప్పింది(Auto driver daughter news).

Auto driver's daughter, ఆటోవాలా కూతురు
ఆటోవాలా కూతురుకు ఆరు గోల్డ్ మెడల్స్

పీహెచ్​డీ పూర్తి చేసి అగ్రికల్చర్ కాలేజ్​లో లెక్చరర్​ కావడమే తన లక్ష్యమని గీత చెప్పింది.

ఇదీ చదవండి: బుల్​ ఫెస్టివల్​లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.