ETV Bharat / bharat

ఆ పాఠశాలలో 101 మందికి కరోనా

author img

By

Published : Dec 6, 2021, 7:23 PM IST

Karnataka schools corona cases: చిక్కమంగళూరు రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా కేసుల సంఖ్య 101కి చేరింది. మొత్తం 90 మంది విద్యార్థులు, 11 మంది సిబ్బందికి వైరస్​ సోకింది.

covid cases in chikmagalur residential school
జవహార్​ నవోదయ విద్యాలయం

Corona positive students in Karnataka: కర్ణాటక చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్​గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్​ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా సోకిన వారిలో 90మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్​ ఉన్నారు. అయితే వారిలో ఎవరికీ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.

రెసిడెన్షియల్​ పాఠశాలలో ఆదివారం మొత్తం 69 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. సోమవారం మరో 32 మందికి పాజిటివ్​గా తెలినట్లు అధికారులు తెలిపారు. వారందరి నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించినట్లు చిక్కమంగళూరు జిల్లా ఆరోగ్య అధికారి ఉమేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!

Corona positive students in Karnataka: కర్ణాటక చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్​గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్​ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా సోకిన వారిలో 90మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్​ ఉన్నారు. అయితే వారిలో ఎవరికీ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు.

రెసిడెన్షియల్​ పాఠశాలలో ఆదివారం మొత్తం 69 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. సోమవారం మరో 32 మందికి పాజిటివ్​గా తెలినట్లు అధికారులు తెలిపారు. వారందరి నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించినట్లు చిక్కమంగళూరు జిల్లా ఆరోగ్య అధికారి ఉమేశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: ఒకే పాఠశాలలో 69మందికి కరోనా.. లక్షణాలు లేకుండానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.