ETV Bharat / bharat

ఆర్​టీసీల మధ్య వివాదం- ఆ రాష్ట్రానిదే విజయం

author img

By

Published : Jun 3, 2021, 1:27 PM IST

రెండు రాష్ట్రాల ఆర్​టీసీ వివాదంలో.. కేరళనే విజయం సాధించింది. రోడ్డు రవాణా సంస్థ సంక్షిప్తనామం- కేఎస్​ఆర్​టీసీ పేరు, లోగోను కర్ణాటక వాడేందుకు వీలు లేదని తీర్పు వెలువడింది.

Karnataka loses legal battle against Kerala
ఆర్​టీసీల మధ్య రగడ

కర్ణాటక, కేరళ మధ్య ఏళ్లుగా సాగుతోన్న ఆర్​టీసీ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో కేరళనే విజయం వరించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్షిప్తనామం - కేఎస్​ఆర్​టీసీని వాడుకునేందుకు కేరళకే హక్కు ఉందని స్పష్టం చేసింది ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ. 1999- ట్రేడ్​మార్క్స్​ చట్టం ప్రకారం.. ఇప్పుడు కేఎస్​ఆర్​టీసీ పేరు, లోగో.. కేరళకు మాత్రమే చెందుతాయని వెల్లడించింది.

ఈ వ్యవహారంలో కేరళపై 2014లో ఫిర్యాదు చేసింది కర్ణాటక. ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ ప్రకారం.. తామే మొదట కేఎస్​ఆర్​టీసీ పేరును ఉపయోగించినట్లు నిరూపించింది కేరళ ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే.. ఆ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

ఇప్పటినుంచి తమ పేరును వాడొద్దని.. త్వరలో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు సమాచారం అందించనున్నట్లు తెలిపారు కేఎస్​ఆర్​టీసీ ఎండీ బిజు ప్రభాకర్​. దీనిని ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్పందించిన డిప్యూటీ సీఎం..

ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ తీర్పుపై స్పందించారు కర్ణాటక ఉపముఖ్యమంత్రి, రవాణా మంత్రి ఎల్​ఎస్​ సావడి. తీర్పు అధికారికంగా ప్రకటించిన అనంతరం.. తాము న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం

కర్ణాటక, కేరళ మధ్య ఏళ్లుగా సాగుతోన్న ఆర్​టీసీ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటంలో కేరళనే విజయం వరించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్షిప్తనామం - కేఎస్​ఆర్​టీసీని వాడుకునేందుకు కేరళకే హక్కు ఉందని స్పష్టం చేసింది ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ. 1999- ట్రేడ్​మార్క్స్​ చట్టం ప్రకారం.. ఇప్పుడు కేఎస్​ఆర్​టీసీ పేరు, లోగో.. కేరళకు మాత్రమే చెందుతాయని వెల్లడించింది.

ఈ వ్యవహారంలో కేరళపై 2014లో ఫిర్యాదు చేసింది కర్ణాటక. ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ ప్రకారం.. తామే మొదట కేఎస్​ఆర్​టీసీ పేరును ఉపయోగించినట్లు నిరూపించింది కేరళ ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే.. ఆ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వెలువడింది.

ఇప్పటినుంచి తమ పేరును వాడొద్దని.. త్వరలో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు సమాచారం అందించనున్నట్లు తెలిపారు కేఎస్​ఆర్​టీసీ ఎండీ బిజు ప్రభాకర్​. దీనిని ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్పందించిన డిప్యూటీ సీఎం..

ట్రేడ్​మార్క్​ రిజిస్ట్రీ తీర్పుపై స్పందించారు కర్ణాటక ఉపముఖ్యమంత్రి, రవాణా మంత్రి ఎల్​ఎస్​ సావడి. తీర్పు అధికారికంగా ప్రకటించిన అనంతరం.. తాము న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.