ETV Bharat / bharat

'నా వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే.. పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా'

author img

By

Published : Nov 13, 2021, 3:26 PM IST

భారత్​కు నిజమైన స్వాతంత్య్రం (Kangana Ranaut Instagram) 2014లోనే వచ్చిందని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ (kangana ranaut news)​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై ఆమె తన వాదనను సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పు అని నిరూపిస్తే.. 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తాను అని పేర్కొన్నారు.

Kangana Ranaut
కంగనా రనౌత్​

భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై (Kangana Ranaut Instagram) తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు ఎదురవుతున్నా.. ఆమె మాత్రం తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

కంగన (kangana ranaut news)​ శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'జస్ట్‌ టు సెట్‌ ది రికార్డ్స్‌ స్ట్రేట్‌' అనే పుస్తకంలోని పేజీలను షేర్‌ చేస్తూ.. 'కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. ఆ ఇంటర్వ్యూ(కంగన మాట్లాడిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ)లో నేను అన్నీ స్పష్టంగా చెప్పాను. 1857లో తొలిసారిగా స్వాతంత్ర్యం కోసం ఉమ్మడి పోరాటం జరిగింది. సుభాష్‌ చంద్రబోస్‌, రాణి లక్ష్మీబాయి, వీర్‌ సావర్కర్‌ లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన చిత్రంలో నేను నటించాను. అందుకోసం 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృత పరిశోధన చేశాను. అప్పుడు జాతీయవాదం పెరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? భగత్‌సింగ్‌, నేతాజీ బోస్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వారికి గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?ఎందుకు విభజన రేఖను తెల్లవ్యక్తి గీయాల్సి వచ్చింది? స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకోవాల్సింది మాని.. ఎందుకు భారతీయులు ఒకరినొకరు చంపుకొన్నారు? ఈ ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. 1857లో జరిగిన యుద్ధం గురించి నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగింది. దీని గురించి ఎవరైనా నాకు హితబోధ చేస్తే తప్పకుండా నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చి.. అందరికీ క్షమాపణ చెబుతాను' అంటూ కంగన రాసుకొచ్చారు.

'భౌతికంగా మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ భారతీయుల మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ లభించిందని నేను ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 2014లో మన నాగరికతకు మళ్లీ జీవం వచ్చి రెక్కలు చాచి ఎగురుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్‌ మాట్లాడనందుకు, చిన్న ప్రాంతాల నుంచి వచ్చినందుకు, మేడ్‌ ఇన్‌ ఇండియా వస్తువులను ఉపయోగించేందుకు ఎవరూ సిగ్గుపడట్లేదు. ఈ విషయాలన్నీ నేను ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించాను. కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను వైరల్‌ చేసి విమర్శలు చేయడం కాదు.. మొత్తం ఎపిసోడ్‌ చూపించి మాట్లాడండి. నిజాలు మాట్లాడేందుకు, వాటి పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక ఆ ఇంటర్వ్యూలో నేను అమరవీరులను అవమానించినట్లు ఎవరైనా నిరూపిస్తే నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తాను' అని కంగన తెలిపారు.

ఇదీ చూడండి: కంగన వ్యాఖ్యలపై దుమారం- చర్యలకు విపక్షాల డిమాండ్​

భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమేనని పేర్కొంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై (Kangana Ranaut Instagram) తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు ఎదురవుతున్నా.. ఆమె మాత్రం తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. అంతేగాక, తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే 'పద్మశ్రీ' పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చారు.

కంగన (kangana ranaut news)​ శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'జస్ట్‌ టు సెట్‌ ది రికార్డ్స్‌ స్ట్రేట్‌' అనే పుస్తకంలోని పేజీలను షేర్‌ చేస్తూ.. 'కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు. ఆ ఇంటర్వ్యూ(కంగన మాట్లాడిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ)లో నేను అన్నీ స్పష్టంగా చెప్పాను. 1857లో తొలిసారిగా స్వాతంత్ర్యం కోసం ఉమ్మడి పోరాటం జరిగింది. సుభాష్‌ చంద్రబోస్‌, రాణి లక్ష్మీబాయి, వీర్‌ సావర్కర్‌ లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన చిత్రంలో నేను నటించాను. అందుకోసం 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటంపై విస్తృత పరిశోధన చేశాను. అప్పుడు జాతీయవాదం పెరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయింది? భగత్‌సింగ్‌, నేతాజీ బోస్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వారికి గాంధీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు?ఎందుకు విభజన రేఖను తెల్లవ్యక్తి గీయాల్సి వచ్చింది? స్వాతంత్ర్యాన్ని వేడుక చేసుకోవాల్సింది మాని.. ఎందుకు భారతీయులు ఒకరినొకరు చంపుకొన్నారు? ఈ ప్రశ్నలకు నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. 1857లో జరిగిన యుద్ధం గురించి నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగింది. దీని గురించి ఎవరైనా నాకు హితబోధ చేస్తే తప్పకుండా నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చి.. అందరికీ క్షమాపణ చెబుతాను' అంటూ కంగన రాసుకొచ్చారు.

'భౌతికంగా మనకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది. కానీ భారతీయుల మనస్సాక్షికి మాత్రం 2014లో స్వేచ్ఛ లభించిందని నేను ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 2014లో మన నాగరికతకు మళ్లీ జీవం వచ్చి రెక్కలు చాచి ఎగురుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్‌ మాట్లాడనందుకు, చిన్న ప్రాంతాల నుంచి వచ్చినందుకు, మేడ్‌ ఇన్‌ ఇండియా వస్తువులను ఉపయోగించేందుకు ఎవరూ సిగ్గుపడట్లేదు. ఈ విషయాలన్నీ నేను ఇంటర్వ్యూలో స్పష్టంగా వివరించాను. కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను వైరల్‌ చేసి విమర్శలు చేయడం కాదు.. మొత్తం ఎపిసోడ్‌ చూపించి మాట్లాడండి. నిజాలు మాట్లాడేందుకు, వాటి పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక ఆ ఇంటర్వ్యూలో నేను అమరవీరులను అవమానించినట్లు ఎవరైనా నిరూపిస్తే నా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తాను' అని కంగన తెలిపారు.

ఇదీ చూడండి: కంగన వ్యాఖ్యలపై దుమారం- చర్యలకు విపక్షాల డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.