ETV Bharat / bharat

శ్రీరామనవమి రోజున మాంసాహారం.. జేఎన్​యూలో విద్యార్థి వర్గాల ఘర్షణ

JNU violence: దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం వసతి గృహంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య వివాదం చెలరేగి రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించటంపై తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆరుగురు విద్యార్థులు గాయపడినట్లు చెప్పారు. అయితే, 60 మంది వరకు గాయపడ్డారని రెండు వర్గాలు ప్రకటించాయి.

author img

By

Published : Apr 11, 2022, 7:22 AM IST

JNU violence
జేఎన్​యూ విద్యార్థుల ఘర్షణ

JNU violence: శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వసతి గృహంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటం వల్ల హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలపారు. మరోవైపు.. 60 మంది వరకు గాయపడ్డారని రెండు వర్గాలు ప్రకటించాయి. పరస్పరం ఘర్షణకు దిగిన వామపక్ష అనుబంధ జేఎన్​యూ స్టూడెంట్స్‌ యూనియన్‌, ఆర్ఎస్​ఎస్​ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ).. తమపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించుకున్నాయి.

కావేరీ హాస్టల్​ మెస్‌లో నవరాత్రి పూజ నిర్వహంచారు పలువురు విద్యార్థులు. మాంసాహారాన్ని వడ్డించొద్దని మెస్​ సూపర్​వైజర్​కు చెప్పారు. నిబంధనల ప్రకారం వామపక్ష సంఘ విద్యార్థులకు మాంసహారం వడ్డించారు మెస్​ సిబ్బంది. మాంసాహారం వడ్డింటంపై ఇరు గ్రూప్​ల మధ్య వాగ్వాదం జరిగింది. చిలికిచిలికి గాలివానగా మారి రాళ్లు రువ్వుకునేదాకా వెళ్లింది.

మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్​యూ స్టూడెంట్స్‌ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఏబీవీపీ.. రామ నవమి వేడుకలు జరగకుండా వారే తమను అడ్డుకున్నారని తెలిపారు. పలువురు విద్యార్థులు ఈ అంశంపై వర్సిటీ వైస్​ ఛాన్సిలర్​కు ఫిర్యాదు చేశారు. జేఎన్​యూలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!

JNU violence: శ్రీరామనవమి రోజు మాంసాహారం వడ్డించడంపై దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వసతి గృహంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటం వల్ల హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలపారు. మరోవైపు.. 60 మంది వరకు గాయపడ్డారని రెండు వర్గాలు ప్రకటించాయి. పరస్పరం ఘర్షణకు దిగిన వామపక్ష అనుబంధ జేఎన్​యూ స్టూడెంట్స్‌ యూనియన్‌, ఆర్ఎస్​ఎస్​ అనుబంధ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ).. తమపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించుకున్నాయి.

కావేరీ హాస్టల్​ మెస్‌లో నవరాత్రి పూజ నిర్వహంచారు పలువురు విద్యార్థులు. మాంసాహారాన్ని వడ్డించొద్దని మెస్​ సూపర్​వైజర్​కు చెప్పారు. నిబంధనల ప్రకారం వామపక్ష సంఘ విద్యార్థులకు మాంసహారం వడ్డించారు మెస్​ సిబ్బంది. మాంసాహారం వడ్డింటంపై ఇరు గ్రూప్​ల మధ్య వాగ్వాదం జరిగింది. చిలికిచిలికి గాలివానగా మారి రాళ్లు రువ్వుకునేదాకా వెళ్లింది.

మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్​యూ స్టూడెంట్స్‌ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఏబీవీపీ.. రామ నవమి వేడుకలు జరగకుండా వారే తమను అడ్డుకున్నారని తెలిపారు. పలువురు విద్యార్థులు ఈ అంశంపై వర్సిటీ వైస్​ ఛాన్సిలర్​కు ఫిర్యాదు చేశారు. జేఎన్​యూలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని దిల్లీ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.