ETV Bharat / bharat

ఈసారి నాలుగుసార్లు జేఈఈ మెయిన్‌ !

author img

By

Published : Dec 11, 2020, 7:09 AM IST

జేఈఈ మెయిన్‌-2021పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. నాలుగు సార్లు పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

jee mains exam to be conducted 4 times in a year
సంవత్సరానికి నాలుగుసార్లు జేఈఈ మెయిన్‌ !

దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్‌-2021ను నాలుగుసార్లు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు తరగతి గదికి దూరమైనందున బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లోనూ ఛాయిస్‌ ఇవ్వనుంది. జాతీయస్థాయి ప్రవేశ, బోర్డు పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. పలువురు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. జేఈఈ మెయిన్‌పై ఇప్పటికే పలు సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి నెలాఖరులో ఒకటి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగుసార్లు పరీక్ష నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి నాలుగు విడతల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని సానుకూల దృకృథంతో పరిశీలిస్తామన్నారు. ప్రతి విడతలో 3-4 రోజుల చొప్పున పరీక్షలు ఉంటాయన్నారు.

గత ఏడాది పాఠ్య ప్రణాళికే.. కానీ

ఈసారి జేఈఈ మెయిన్‌కు పాత పాఠ్య ప్రణాళికే (సిలబస్‌) ఉంటుందని, కాకపోతే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఛాయిస్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘గతంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కలిపి 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చి, ఒక్కోదానిలో 25 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే ఆ మేరకు మార్కులు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని చెప్పారు. నీట్‌కు కూడా గతేడాది పాఠ్య ప్రణాళిక యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.

నీట్‌ పరీక్ష విధానంపై సంప్రదింపులు

నీట్‌ నిర్వహించే తేదీని కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)తో సంప్రదించి ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో తేదీని వెల్లడిస్తామన్నారు.పరీక్ష ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? అన్న దానిపై ఆరోగ్యశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పది, 12వ తరగతి వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేసే క్రమంలో అన్ని రాష్ట్రాలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. సీబీఎస్‌ఈ ప్రయోగ పరీక్షల రద్దుపై మంత్రి మాట్లాడుతూ ప్రాక్టికల్‌, బోర్డు పరీక్షల తేదీలపై సీబీఎస్‌ఈనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి : 'నీట్‌ 2021 రద్దు చేసే ఆలోచన లేదు'

దేశవ్యాప్తంగా ఈసారి జేఈఈ మెయిన్‌-2021ను నాలుగుసార్లు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు తరగతి గదికి దూరమైనందున బహుళ ఐచ్ఛిక ప్రశ్నల్లోనూ ఛాయిస్‌ ఇవ్వనుంది. జాతీయస్థాయి ప్రవేశ, బోర్డు పరీక్షలు, సిలబస్‌ తదితర అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. పలువురు అడిగిన సందేహాలకు సమాధానాలిచ్చారు. జేఈఈ మెయిన్‌పై ఇప్పటికే పలు సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఫిబ్రవరి నెలాఖరులో ఒకటి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగుసార్లు పరీక్ష నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యార్థి నాలుగు విడతల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చే అంశాన్ని సానుకూల దృకృథంతో పరిశీలిస్తామన్నారు. ప్రతి విడతలో 3-4 రోజుల చొప్పున పరీక్షలు ఉంటాయన్నారు.

గత ఏడాది పాఠ్య ప్రణాళికే.. కానీ

ఈసారి జేఈఈ మెయిన్‌కు పాత పాఠ్య ప్రణాళికే (సిలబస్‌) ఉంటుందని, కాకపోతే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఛాయిస్‌ ఇవ్వాలనే ఆలోచన ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘గతంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కలిపి 75 ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చి, ఒక్కోదానిలో 25 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే ఆ మేరకు మార్కులు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’ అని చెప్పారు. నీట్‌కు కూడా గతేడాది పాఠ్య ప్రణాళిక యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.

నీట్‌ పరీక్ష విధానంపై సంప్రదింపులు

నీట్‌ నిర్వహించే తేదీని కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)తో సంప్రదించి ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో తేదీని వెల్లడిస్తామన్నారు.పరీక్ష ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? అన్న దానిపై ఆరోగ్యశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పది, 12వ తరగతి వార్షిక పరీక్షల తేదీలను ఖరారు చేసే క్రమంలో అన్ని రాష్ట్రాలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. సీబీఎస్‌ఈ ప్రయోగ పరీక్షల రద్దుపై మంత్రి మాట్లాడుతూ ప్రాక్టికల్‌, బోర్డు పరీక్షల తేదీలపై సీబీఎస్‌ఈనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి : 'నీట్‌ 2021 రద్దు చేసే ఆలోచన లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.