ETV Bharat / bharat

డీలిమిటేషన్ కమిషన్​తో భేటీకి పార్టీలన్నీ సుముఖం!

జమ్మకశ్మీర్​లో పర్యటిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) కమిషన్​తో భేటీ అయ్యేందుకు దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అంగీకరించాయి. బుధవారం ఈ పార్టీలతో ఒక సమావేశం నిర్వహించి, పునర్విభజనపై వాటి అభిప్రాయాలను కమిషన్​ స్వీకరించనుంది.

author img

By

Published : Jul 7, 2021, 5:07 AM IST

Updated : Jul 7, 2021, 7:23 AM IST

delimitaion commission
డీలిమిటేషన్ కమిషన్

శాసనసభ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్మకశ్మీర్‌లోని నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఏర్పాటైన (డీలిమిటేషన్) కమిషన్​తో భేటీ అయ్యేందుకు దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అంగీకరించాయి. మంగళవారం శ్రీనగర్‌కు చేరుకున్న కమిషన్.. బుధవారం ఒక సమావేశం నిర్వహించి, పునర్విభజనపై వాటి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.

పీడీపీ, ఏఎన్​సీ మాత్రం ..

పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఏఎన్‌సీ) పార్టీలు మాత్రం ఈ భేటీకి హాజరు కాకూడదని నిర్ణయించాయి. కమిషన్ ఎలాంటి చట్టబద్ధత లేదని, జమ్మూ-కశ్మీర్ ప్రజల రాజకీయాధికారాలను తొలగించే ప్రక్రియలో కమిషన్ ఒక భాగమని పీడీపీ ఆరోపించింది. కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్​కు ఈ మేరకు లేఖ రాసింది. కమిషన్ రాక అంతా ముందస్తు వ్యూహంలో భాగమేనంది. కమిషన్ ఏర్పాటు పైనే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సమావేశానికి తాము వెళ్లడం లేదని ఏఎన్​సీ తెలిపింది.

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపనుంది. కాంగ్రెస్ తరపున ఆరుగురు హాజరుకానున్నారు. ఇతర పార్టీలు తమ ప్రతినిధుల్ని పంపనున్నాయి.

ఇదీచూడండి: ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!

ఇదీ చూడండి: 'కశ్మీర్​వాసుల్లో అపనమ్మకం తొలగించాలి'

శాసనసభ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్మకశ్మీర్‌లోని నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఏర్పాటైన (డీలిమిటేషన్) కమిషన్​తో భేటీ అయ్యేందుకు దాదాపు అన్ని ప్రధాన పార్టీలు అంగీకరించాయి. మంగళవారం శ్రీనగర్‌కు చేరుకున్న కమిషన్.. బుధవారం ఒక సమావేశం నిర్వహించి, పునర్విభజనపై వాటి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.

పీడీపీ, ఏఎన్​సీ మాత్రం ..

పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఏఎన్‌సీ) పార్టీలు మాత్రం ఈ భేటీకి హాజరు కాకూడదని నిర్ణయించాయి. కమిషన్ ఎలాంటి చట్టబద్ధత లేదని, జమ్మూ-కశ్మీర్ ప్రజల రాజకీయాధికారాలను తొలగించే ప్రక్రియలో కమిషన్ ఒక భాగమని పీడీపీ ఆరోపించింది. కమిషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్​కు ఈ మేరకు లేఖ రాసింది. కమిషన్ రాక అంతా ముందస్తు వ్యూహంలో భాగమేనంది. కమిషన్ ఏర్పాటు పైనే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున సమావేశానికి తాము వెళ్లడం లేదని ఏఎన్​సీ తెలిపింది.

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపనుంది. కాంగ్రెస్ తరపున ఆరుగురు హాజరుకానున్నారు. ఇతర పార్టీలు తమ ప్రతినిధుల్ని పంపనున్నాయి.

ఇదీచూడండి: ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!

ఇదీ చూడండి: 'కశ్మీర్​వాసుల్లో అపనమ్మకం తొలగించాలి'

Last Updated : Jul 7, 2021, 7:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.