దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయం నూతన విధి విధానాలను పాలకమండలి విడుదల చేసింది. ఆదివారం తప్ప.. వారంలో మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం రోజున దేవాలయ పరిసరాలను శానిటైజ్ చేస్తామని పేర్కొంది. దేవాలయ విధి విధానాలపై క్రిషన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి దేవాలయ అథారిటీ (ఎస్జీటీఏ) పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు.
ప్రతివారంలో రెండు రోజులకొకసారి రాత్రి సమయంలో.. దేవాలయంలో శానిటైజేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనం ప్రతిరోజు ఉదయం 6గంటలకు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దేవాలయంలో పాటించాల్సిన విధివిధానాలను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. భక్తులు కరోనా నియమాలను తప్పకుండా పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: బారికేడ్ గ్రిల్ మధ్య తల ఇరుక్కుని విలవిల