1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో కేరళ పోలీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది.
నంబి నారాయణన్పై పోలీసులు కుట్ర పన్నారన్న అభియోగాలపై అత్యున్నత కమిటీ సమర్పించిన నివేదికను సీబీఐకి అప్పగించాలని ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నివేదికలోని వివరాలను ప్రాథమిక దర్యాప్తు ఫలితాలుగా పరిగణించి.. వాటి ఆధారంగా చర్యలు తీసుకునే అధికారాన్ని సీబీఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ.. నంబి నారాయణ్పై మోపిన ఆరోపణలు అవాస్తవాలేనని తాజాగా స్పష్టం చేసింది.
ఏంటీ కేసు?
ఇస్రోలో విశేష సేవలందించిన నంబి నారాయణన్.. 1994లో దేశద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇస్రో మిషన్లకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను విదేశాలకు చేరవేశారన్న అభియోగాలు ఆయనపై వచ్చాయి.
ఇదీ చూడండి: కొవిడ్ నియంత్రణ మా పని కాదు: ఈసీ