ETV Bharat / bharat

బీమా పాలసీ కోసం పిలిచి మహిళపై రేప్.. మతిస్థిమితం లేని పదేళ్ల బాలికపై..

author img

By

Published : Jul 20, 2022, 2:48 PM IST

రూ.30 లక్షల పాలసీ కొంటామని ఓ హోటల్​కు పిలిచి బీమా కంపెనీ ఉద్యోగినిపై అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. గురుగ్రామ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, మతిస్థిమితం లేని బాలికను ఓ వ్యక్తి రేప్ చేశాడు.

Insurance agent raped
Insurance agent raped

Insurance agent raped: హరియాణా గురుగ్రామ్​లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బీమా పాలసీ తీసుకుంటామని చెప్పి ఓ హోటల్​కు మహిళను పిలిపించుకున్న దుండగులు.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులను వికాస్ జగ్గు, జితేంద్ర చౌదరిగా గుర్తించారు. ఇరువురిపై భోండ్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సోనీపత్​కు చెందిన బాధితురాలు గురుగ్రామ్​లో నివసిస్తోంది. 2019లో జగ్గుకు ఇన్సూరెన్స్ పాలసీ విక్రయించింది. జగ్గు తల్లి మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించేందుకు బాధితురాలు సహకరించింది. అయితే, గత 15 రోజుల నుంచి జగ్గు.. బాధితురాలికి తరచూ కాల్స్ చేశాడు. తన స్నేహితుడు రూ.30 లక్షల బీమా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని, పాలసీ ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం మహిళను హోటల్​కు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మహిళను జగ్గు, చౌదరి కలిసి రేప్ చేశారు.

మైనర్​పై దారుణం
మతిస్థిమితం లేని బాలికపై ఓ కామాంధుడు తన దుష్ట వాంఛ తీర్చుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​నగర్​కు చెందిన పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి న్యూ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంటి సమీపంలో బాలిక ఆడుకుంటుండగా నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గర్లోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. కొందరు మహిళలు బాలిక అరుపులు, ఏడుపులు విని ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులకు స్థానిక మహిళలు సమాచారం అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు.

పసిబిడ్డల్ని చంపి.. ఆపై..
గుజరాత్ బనాస్కాంఠా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇద్దరు మైనర్ కూతుర్లను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మూడు, ఐదేళ్ల వయసున్న చిన్నారులిద్దరినీ ఓ బావిలోకి తోసేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. వారి తండ్రి సైతం నీళ్లలో దూకి చనిపోయాడని చెప్పారు. ఇందుకు కారణాలేంటన్నది తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.

'పిల్లల తండ్రి పేరు విక్రమ్ దర్జీ. చనిపోయే ముందు కూతుళ్లతో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్​లో షేర్ చేశాడు. ఫొటోలో ఓ పాయిజన్ సీసా కూడా ఉంది. కూతుళ్లకు విషం ఇచ్చి, అతడు కూడా తాగి ఉంటాడు. ఆ తర్వాత పిల్లలను బావిలో తోసేసి, అతడు దూకేసి ఉంటాడు' అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు దర్జీ భార్య ఇంట్లోనే ఉంది. మంగళవారం రాత్రి స్థానికులు బావి వద్దకు చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యాసిడ్ దాడి
సరిహద్దు గోడ విషయమై కేరళ తిరువనంతపురంలో ఓ మహిళ తన పక్కింట్లో ఉంటున్నవారిపై యాసిడ్ దాడి చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె కూతురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రే బాధితుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

Insurance agent raped: హరియాణా గురుగ్రామ్​లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బీమా పాలసీ తీసుకుంటామని చెప్పి ఓ హోటల్​కు మహిళను పిలిపించుకున్న దుండగులు.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులను వికాస్ జగ్గు, జితేంద్ర చౌదరిగా గుర్తించారు. ఇరువురిపై భోండ్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సోనీపత్​కు చెందిన బాధితురాలు గురుగ్రామ్​లో నివసిస్తోంది. 2019లో జగ్గుకు ఇన్సూరెన్స్ పాలసీ విక్రయించింది. జగ్గు తల్లి మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించేందుకు బాధితురాలు సహకరించింది. అయితే, గత 15 రోజుల నుంచి జగ్గు.. బాధితురాలికి తరచూ కాల్స్ చేశాడు. తన స్నేహితుడు రూ.30 లక్షల బీమా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని, పాలసీ ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం మహిళను హోటల్​కు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మహిళను జగ్గు, చౌదరి కలిసి రేప్ చేశారు.

మైనర్​పై దారుణం
మతిస్థిమితం లేని బాలికపై ఓ కామాంధుడు తన దుష్ట వాంఛ తీర్చుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​నగర్​కు చెందిన పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి న్యూ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంటి సమీపంలో బాలిక ఆడుకుంటుండగా నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గర్లోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. కొందరు మహిళలు బాలిక అరుపులు, ఏడుపులు విని ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులకు స్థానిక మహిళలు సమాచారం అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు.

పసిబిడ్డల్ని చంపి.. ఆపై..
గుజరాత్ బనాస్కాంఠా జిల్లాలో ఓ వ్యక్తి తన ఇద్దరు మైనర్ కూతుర్లను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మూడు, ఐదేళ్ల వయసున్న చిన్నారులిద్దరినీ ఓ బావిలోకి తోసేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. వారి తండ్రి సైతం నీళ్లలో దూకి చనిపోయాడని చెప్పారు. ఇందుకు కారణాలేంటన్నది తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.

'పిల్లల తండ్రి పేరు విక్రమ్ దర్జీ. చనిపోయే ముందు కూతుళ్లతో సెల్ఫీ దిగి వాట్సాప్ గ్రూప్​లో షేర్ చేశాడు. ఫొటోలో ఓ పాయిజన్ సీసా కూడా ఉంది. కూతుళ్లకు విషం ఇచ్చి, అతడు కూడా తాగి ఉంటాడు. ఆ తర్వాత పిల్లలను బావిలో తోసేసి, అతడు దూకేసి ఉంటాడు' అని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు దర్జీ భార్య ఇంట్లోనే ఉంది. మంగళవారం రాత్రి స్థానికులు బావి వద్దకు చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యాసిడ్ దాడి
సరిహద్దు గోడ విషయమై కేరళ తిరువనంతపురంలో ఓ మహిళ తన పక్కింట్లో ఉంటున్నవారిపై యాసిడ్ దాడి చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె కూతురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రే బాధితుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.