ETV Bharat / bharat

'ద్రవ్యోల్బణం నుంచి దేశ ప్రజలను కాపాడండి'

author img

By

Published : Mar 19, 2022, 12:46 PM IST

Rahul Gandhi news: పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ప్రజలను కాపాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో గరిష్ఠానికి చేరిందని ఇకనైనా కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించాలని అన్నారు.

rahul Gandhi
రాహుల్​ గాంధీ

Rahul Gandhi news: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అన్నారు. పెరిగే ధరల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలను చేపట్టాలని కోరారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించిందని చెప్పారు.

"ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. క్రూడ్​ ఆయిల్​ ధరలు బ్యారెల్​ 100 డాలర్లకు పైగా పెరిగింది. ఆహార వస్తువుల ధరలు 22 శాతం మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థ కొవిడ్​ కారణంగా దెబ్బతింది. కనీసం ఇప్పుడు అయినా కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ప్రజలను పన్ను బారి నుంచి రక్షించాలి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రిటైల్​ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠాన్ని తాగింది. టోకు ద్రవ్యోల్బణం కూడా ఫిబ్రవరిలో 13.11 శాతం పెరిగిందని ప్రభుత్వల లెక్కలు చెప్తున్నాయి.

ఇదీ చూడండి:

అట్టహాసంగా పంజాబ్​ కేబినెట్​ మంత్రుల ప్రమాణస్వీకారం

Rahul Gandhi news: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మరోసారి మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అన్నారు. పెరిగే ధరల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలను చేపట్టాలని కోరారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించిందని చెప్పారు.

"ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. క్రూడ్​ ఆయిల్​ ధరలు బ్యారెల్​ 100 డాలర్లకు పైగా పెరిగింది. ఆహార వస్తువుల ధరలు 22 శాతం మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థ కొవిడ్​ కారణంగా దెబ్బతింది. కనీసం ఇప్పుడు అయినా కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ప్రజలను పన్ను బారి నుంచి రక్షించాలి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రిటైల్​ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠాన్ని తాగింది. టోకు ద్రవ్యోల్బణం కూడా ఫిబ్రవరిలో 13.11 శాతం పెరిగిందని ప్రభుత్వల లెక్కలు చెప్తున్నాయి.

ఇదీ చూడండి:

అట్టహాసంగా పంజాబ్​ కేబినెట్​ మంత్రుల ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.