ETV Bharat / bharat

'భారత్​ను ఇరకాటంలో పెట్టాలనే.. పాక్​ తప్పుడు ఆరోపణలు' - Pakistan defames India news

ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై భారత్ దాడిచేసిందని పాకిస్థాన్ చేసిన ఆరోపణలు అవాస్తమవని తెలిపారు విశ్రాంత ఆర్మీ జనరల్​ ఆశోక్​ మెహతా. అంతర్జాతీయ సమాజంలో భారత్​ను తప్పుగా చూపాలనే దురుద్దేశంతోనే పాక్​ ఇలాంటి అసత్య ప్రచారం చేస్తోందని చెప్పారు.

India rejects Pak's claim on UN attack convoy
'భారత్​ను ఇరాకాటంలో పెట్టాలనే పాకిస్థాన్​ తప్పుడు ఆరోపణలు'
author img

By

Published : Dec 19, 2020, 10:20 PM IST

Updated : Dec 20, 2020, 6:44 AM IST

నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల(యూఎన్​ఎంఓజీఐపీ) జీపును భారత సైన్యం కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ చేస్తున్న​ ఆరోపణలు కుట్రపూరితమైనవని విశ్రాంత ఆర్మీ జనరల్​ అశోక్​ కే మెహతా అన్నారు. యూఎన్​ఎంఓజీఐపీని ప్రస్తావిస్తూ ఈ తరహా ఆరోపణలు పాక్ తొలిసారి చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత్​ను తప్పుగా చూపాలని పాక్ అసత్య ప్రచారాలు చేస్తోందని అశో​క్​ చెప్పారు.

" భారత్​పై పాకిస్థాన్ ఎప్పుడూ నిందలు మోపుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు భారత్​ను తప్పుగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ తరహా ఆరోపణలు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు భారత సైన్యం ఏ విధంగా బదులిస్తుందో మనకు తెలుసు. పాకిస్థాన్​ చర్యలకు భారత్ దీటుగా బదులిచ్చే క్రమంలోనే పొరపాటున ప్రమాదవశాత్తు ఐరాస మిలటరీ పరిశీలకుల వాహనానికి ఏమైనా జరిగి ఉండవచ్చు. అంతేగానీ వాస్తవంగా కావాలని దాడి జరగే అవకాశమే లేదు."

-అశోక్​ కే మెహతా, విశ్రాంత ఆర్మీ జనరల్​.

2021లో ఐరాస భద్రతా మండలి ఛైర్మన్ బాధ్యతలను భారత్​ చేపట్టనున్న నేపథ్యంలో పాక్ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మెహతా అన్నారు. అయితే ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి ఆరోపణలను భారత్ ఖండించినప్పటికీ, అంతర్జాతీయ మీడియాను పిలిచి ఈ దాడి నిజంగా జరిగిందని పాకిస్థాన్​ రుజువు చేసే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.

భారత రాయబారికి సమన్లు

ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి జరిగినందుకు నిరసనగా మరునాడే ఇస్లామాబాద్​లోని భారత రాయబారికి సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది పాకిస్థాన్​.

నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల(యూఎన్​ఎంఓజీఐపీ) జీపును భారత సైన్యం కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ చేస్తున్న​ ఆరోపణలు కుట్రపూరితమైనవని విశ్రాంత ఆర్మీ జనరల్​ అశోక్​ కే మెహతా అన్నారు. యూఎన్​ఎంఓజీఐపీని ప్రస్తావిస్తూ ఈ తరహా ఆరోపణలు పాక్ తొలిసారి చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ముందు భారత్​ను తప్పుగా చూపాలని పాక్ అసత్య ప్రచారాలు చేస్తోందని అశో​క్​ చెప్పారు.

" భారత్​పై పాకిస్థాన్ ఎప్పుడూ నిందలు మోపుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు భారత్​ను తప్పుగా చూపాలనే కుట్రలో భాగంగానే ఈ తరహా ఆరోపణలు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు భారత సైన్యం ఏ విధంగా బదులిస్తుందో మనకు తెలుసు. పాకిస్థాన్​ చర్యలకు భారత్ దీటుగా బదులిచ్చే క్రమంలోనే పొరపాటున ప్రమాదవశాత్తు ఐరాస మిలటరీ పరిశీలకుల వాహనానికి ఏమైనా జరిగి ఉండవచ్చు. అంతేగానీ వాస్తవంగా కావాలని దాడి జరగే అవకాశమే లేదు."

-అశోక్​ కే మెహతా, విశ్రాంత ఆర్మీ జనరల్​.

2021లో ఐరాస భద్రతా మండలి ఛైర్మన్ బాధ్యతలను భారత్​ చేపట్టనున్న నేపథ్యంలో పాక్ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మెహతా అన్నారు. అయితే ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి ఆరోపణలను భారత్ ఖండించినప్పటికీ, అంతర్జాతీయ మీడియాను పిలిచి ఈ దాడి నిజంగా జరిగిందని పాకిస్థాన్​ రుజువు చేసే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.

భారత రాయబారికి సమన్లు

ఐరాస మిలిటరీ పరిశీలకుల వాహనంపై దాడి జరిగినందుకు నిరసనగా మరునాడే ఇస్లామాబాద్​లోని భారత రాయబారికి సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది పాకిస్థాన్​.

Last Updated : Dec 20, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.