ETV Bharat / bharat

'ఆ వ్యాధుల నివారణలో ముందున్న భారత్' - అంటువ్యాధులు రోగాల

అంటువ్యాధులు కాని రోగాల నివారణకు చేపట్టే కార్యక్రమాల విషయంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్​సీడీ మరణాలను తగ్గించినందుకు భారత్​పై ఐరాస ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

India at forefront of initiatives to prevent non-communicable diseases: PM Modi
'ఆ వ్యాధుల నివారణలో ముందున్న భారత్'
author img

By

Published : Mar 24, 2021, 12:05 PM IST

అంటువ్యాధులు కాని రోగాల(నాన్ కమ్యునికబుల్ డిసీజెస్-ఎన్​సీడీ) నివారణకు భారత్ విశేష కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా చేపట్టే కార్యక్రమాల విషయంలో భారత్ ముందంజలో ఉందని అన్నారు. ఎన్​సీడీ మరణాలను గణనీయంగా తగ్గించినందుకు భారత్​పై ఐరాస ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

  • India is at the forefront of initiatives that seek to prevent non-communicable diseases and further wellness.

    Grateful to @UNITAR for their kind words.

    Together, we all have to make our planet healthier. https://t.co/pgiwIhknSx

    — Narendra Modi (@narendramodi) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అసంక్రమిక వ్యాధులను నివారించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో భారత్ ముందంజలో ఉంది. యూఎన్​ఐటీఏఆర్ చేసిన వ్యాఖ్యలు సంతోషకరం. అందరం కలిసి ఈ భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎన్​సీడీ నివారణలో భారతదేశ పురోగతిని గుర్తిస్తూ ఐరాసకు చెందిన ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(యూఎన్ఐటీఏఆర్) విభాగం ఓ ప్రకటన చేసింది. అకాల మరణాలను తగ్గించేందుకు భారత్ చేసిన కృషిని ప్రశంసించింది. సాధారణ ఎన్​సీడీలను నివారించేందుకు అమలు చేస్తున్న 'నేషనల్ మల్టీసెక్టోరియల్ యాక్షన్ ప్లాన్​'పై అవగాహన పెంచుకునేందుకు భారత సహకారాన్ని కోరింది.

ఇదీ చదవండి: తదుపరి సీజేగా జస్టిస్ రమణ- జస్టిస్​ బోబ్డే సిఫార్సు

అంటువ్యాధులు కాని రోగాల(నాన్ కమ్యునికబుల్ డిసీజెస్-ఎన్​సీడీ) నివారణకు భారత్ విశేష కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా చేపట్టే కార్యక్రమాల విషయంలో భారత్ ముందంజలో ఉందని అన్నారు. ఎన్​సీడీ మరణాలను గణనీయంగా తగ్గించినందుకు భారత్​పై ఐరాస ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

  • India is at the forefront of initiatives that seek to prevent non-communicable diseases and further wellness.

    Grateful to @UNITAR for their kind words.

    Together, we all have to make our planet healthier. https://t.co/pgiwIhknSx

    — Narendra Modi (@narendramodi) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అసంక్రమిక వ్యాధులను నివారించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో భారత్ ముందంజలో ఉంది. యూఎన్​ఐటీఏఆర్ చేసిన వ్యాఖ్యలు సంతోషకరం. అందరం కలిసి ఈ భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎన్​సీడీ నివారణలో భారతదేశ పురోగతిని గుర్తిస్తూ ఐరాసకు చెందిన ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(యూఎన్ఐటీఏఆర్) విభాగం ఓ ప్రకటన చేసింది. అకాల మరణాలను తగ్గించేందుకు భారత్ చేసిన కృషిని ప్రశంసించింది. సాధారణ ఎన్​సీడీలను నివారించేందుకు అమలు చేస్తున్న 'నేషనల్ మల్టీసెక్టోరియల్ యాక్షన్ ప్లాన్​'పై అవగాహన పెంచుకునేందుకు భారత సహకారాన్ని కోరింది.

ఇదీ చదవండి: తదుపరి సీజేగా జస్టిస్ రమణ- జస్టిస్​ బోబ్డే సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.