ETV Bharat / bharat

Hypersonic Weapons: హైపర్‌సోనిక్‌ జాబితాలో భారత్​

author img

By

Published : Oct 23, 2021, 7:15 AM IST

హైపర్‌సోనిక్‌ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్​ (Hypersonic Weapons India) కూడా చేరింది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ఓ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో చేతులు కలిపిందని తెలిపింది.

hypersonic missile of india
హైపర్‌సోనిక్‌ జాబితాలో ఇండియా

ధ్వని కన్నా అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ ఆయుధాలను (Hypersonic Weapons) అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్‌ (Hypersonic Weapons India) కూడా ఉందని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో భాగస్వామ్యం వహించిందని తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని (Hypersonic Missile) చైనా పరీక్షించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెస్‌ పరిశోధన సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఈ నివేదికను రూపొందించింది.

ఇందులోని అంశాల ప్రకారం..

  • హైపర్‌సోనిక్‌ అస్త్రాల విషయంలో అమెరికా, రష్యా, చైనాలు ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ దేశాలూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.
  • ఈ సాంకేతికత కోసం ఆస్ట్రేలియా.. అమెరికాతో భాగస్వామ్యం వహిస్తోంది. భారత్‌ మాత్రం రష్యాతో చేయి కలిపింది.
  • ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్‌-2 హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి కోసం భారత్‌, రష్యా సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ అస్త్రాన్ని 2017లోనే సైనిక దళాల్లో చేర్చాల్సింది. తీవ్ర జాప్యం కారణంగా.. 2025-28 మధ్య ఇది సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది.
  • దీనికితోడు భారత్‌ సొంతంగా 'హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ వెహికల్‌' కార్యక్రమం కింద ఒక హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాక్‌ 6 (ధ్వని కన్నా ఆరు రెట్లు వేగంగా పయనించే) స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ను 2019 జూన్‌లో, 2020 సెప్టెంబరులో విజయవంతంగా పరీక్షించింది.
  • భారత్‌ దాదాపుగా 12 హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్స్‌ను నిర్వహిస్తోంది. అక్కడ 'మ్యాక్‌ 13' వేగంలో కూడా పరీక్షలు నిర్వహించొచ్చు.

అమెరికా పరీక్ష విజయవంతం

అమెరికా తాజాగా ఒక హైపర్‌సోనిక్‌ క్షిపణి పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించింది. వర్జీనియాలోని వాలాప్స్‌లోని ఒక కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. సాధారణ హైపర్‌సోనిక్‌ క్షిపణిని (Hypersonic Us Missile) అభివృద్ధి చేయడంలో ఇదో ముందడుగు అని అమెరికా నౌకాదళం పేర్కొంది. ఇందులో అధునాతన సాంకేతికతలను పరీక్షించినట్లు వివరించింది. చైనా ఇటీవల హైపర్‌సోనిక్‌ పరీక్షను నిర్వహించిన నేపథ్యంలో అమెరికా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. నాడు డ్రాగన్‌ పరీక్షించిన అస్త్రం భూమిని చుట్టేసి, అంతిమంగా నేలను తాకినట్లు వార్తలు వచ్చాయి. అయితే లక్షిత ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అది పడింది. మరోవైపు చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణుల అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత

ధ్వని కన్నా అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ ఆయుధాలను (Hypersonic Weapons) అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్‌ (Hypersonic Weapons India) కూడా ఉందని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో భాగస్వామ్యం వహించిందని తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని (Hypersonic Missile) చైనా పరీక్షించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెస్‌ పరిశోధన సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఈ నివేదికను రూపొందించింది.

ఇందులోని అంశాల ప్రకారం..

  • హైపర్‌సోనిక్‌ అస్త్రాల విషయంలో అమెరికా, రష్యా, చైనాలు ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ దేశాలూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.
  • ఈ సాంకేతికత కోసం ఆస్ట్రేలియా.. అమెరికాతో భాగస్వామ్యం వహిస్తోంది. భారత్‌ మాత్రం రష్యాతో చేయి కలిపింది.
  • ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్‌-2 హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి కోసం భారత్‌, రష్యా సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ అస్త్రాన్ని 2017లోనే సైనిక దళాల్లో చేర్చాల్సింది. తీవ్ర జాప్యం కారణంగా.. 2025-28 మధ్య ఇది సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది.
  • దీనికితోడు భారత్‌ సొంతంగా 'హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ వెహికల్‌' కార్యక్రమం కింద ఒక హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాక్‌ 6 (ధ్వని కన్నా ఆరు రెట్లు వేగంగా పయనించే) స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ను 2019 జూన్‌లో, 2020 సెప్టెంబరులో విజయవంతంగా పరీక్షించింది.
  • భారత్‌ దాదాపుగా 12 హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్స్‌ను నిర్వహిస్తోంది. అక్కడ 'మ్యాక్‌ 13' వేగంలో కూడా పరీక్షలు నిర్వహించొచ్చు.

అమెరికా పరీక్ష విజయవంతం

అమెరికా తాజాగా ఒక హైపర్‌సోనిక్‌ క్షిపణి పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించింది. వర్జీనియాలోని వాలాప్స్‌లోని ఒక కేంద్రంలో ఈ పరీక్ష జరిగింది. సాధారణ హైపర్‌సోనిక్‌ క్షిపణిని (Hypersonic Us Missile) అభివృద్ధి చేయడంలో ఇదో ముందడుగు అని అమెరికా నౌకాదళం పేర్కొంది. ఇందులో అధునాతన సాంకేతికతలను పరీక్షించినట్లు వివరించింది. చైనా ఇటీవల హైపర్‌సోనిక్‌ పరీక్షను నిర్వహించిన నేపథ్యంలో అమెరికా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. నాడు డ్రాగన్‌ పరీక్షించిన అస్త్రం భూమిని చుట్టేసి, అంతిమంగా నేలను తాకినట్లు వార్తలు వచ్చాయి. అయితే లక్షిత ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అది పడింది. మరోవైపు చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణుల అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆందోళన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.