ETV Bharat / bharat

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే! జనవరిలో సీట్ల సర్దుబాటు- ఇండియా కూటమి భేటీలో నిర్ణయం

author img

By PTI

Published : Dec 19, 2023, 7:15 PM IST

Updated : Dec 19, 2023, 7:47 PM IST

India Alliance PM Candidate : ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ప్రతిపాదించారు బంగాల్‌, దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌. విపక్ష కూటమి నాలుగో భేటీలో ఈ ప్రతిపాదన చేశారు. కాగా, జనవరిలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

india alliance pm candidate
india alliance pm candidate

India Alliance PM Candidate : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు బంగాల్‌, దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌. అయితే ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష కూటమి గెలుపే ముఖ్యమని, ఇతర విషయాలపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారసభల నిర్వహణే అజెండాగా దిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్లమెంటు ఉభయసభల్లో 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు ఇండియా కూటమి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

  • #WATCH | After the conclusion of the INDIA Alliance meeting, Congress president Mallikarjun Kharge says "We have passed a resolution that suspension is undemocratic. We will all have to fight to save democracy and all of us are ready to do that. We raised the issue of security… pic.twitter.com/nuDVQUe2Lg

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇండియా కూటమి సమష్టి పోరాటమే ప్రధాన కర్తవ్యంగా చర్చ జరిగింది. ముందు పోరాటం చేసి గెలిచిన తర్వాత, ప్రధాని ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించనున్నాము. ఒకే గొడుగు కిందకు రాకపోతే కూటమి ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించే అవకాశం లేదు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాము. పార్లమెంటులో దాడి విషయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రధాని, హోం మంత్రి ఇరువురు సభకు హాజరై వివరణ ఇవ్వాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని ప్రారంభోత్సవాలకు, పర్యటనలకు పరిమితం అవుతున్నారు. పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారి ఇంత మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని నమోస్వామ్యంగా మార్చారు.

ప్రజలతో మమేకం అయ్యి పోరాటం కొనసాగించాలని కూటమి నిర్ణయించింది. ఈనెల 22న ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తాము. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటాయి. రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి జఠిలమైన రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. దిల్లీ, పంజాబ్‌లకు సంబంధించిన వ్యూహాన్ని తరువాత ఖరారు చేస్తాము."
--మల్లిఖార్జున ఖర్గే

'ఖర్గేను మమతాబెనర్జీ ప్రతిపాదించలేదు'
అయితే, ప్రధానమంత్రిగా మల్లిఖార్జున ఖర్గేను మమతా బెనర్జీ ప్రతిపాదించలేదని చెప్పారు కాంగ్రెస్​ నేత పీసీ థామస్​. ప్రధాని అభ్యర్థిగా దళితుడు ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారని, కానీ ఎవరి పేరును చెప్పలేదని థామస్ తెలిపారు. ఆమె చివర్లో ఈ ప్రతిపాదన చేయడం వల్ల దానిపై ఎక్కువగా మాట్లాడలేదని ఆయన వివరించారు.

  • #WATCH | On the reports of West Bengal CM Mamata Banerjee proposing the name of Congress chief Mallilkarjun Kharge as the PM face of the INDIA Alliance, Kerala Congress leader PC Thomas says, "She did not suggest so. While she spoke, Mamata Banerjee said that it would be good if… pic.twitter.com/P1sBxj8KqS

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనవరిలో రెండో వారంలో సీట్ల పంపకం
మరోవైపు సీట్ల సర్దుబాటుపై జనవరి రెండో వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, ఆర్​జేడీ అధినేత లాలుప్రసాద్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన తరఫున మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, బిహార్‌, బంగాల్‌, దిల్లీ, తమిళనాడు, పంజాబ్‌ సీఎంలు నీతీశ్‌కుమార్‌, మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, MK స్టాలిన్‌, భగవంత్‌ మాన్‌ పాల్గొన్నారు.

  • #WATCH | After the INDIA Alliance meeting, SP chief Akhilesh Yadav says, "...All parties are ready to hit the ground after the distribution of tickets very soon."

    He also says, "I have said from the first day that the strategy of INDIA Alliance will be PDA. We will defeat… pic.twitter.com/nT5EJk1jHW

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | On the INDIA Alliance meeting, Delhi CM Arvind Kejriwal says, "The meeting was good. The campaigning, seat sharing and everything will begin soon. No (convenor hasn't been selected) yet." pic.twitter.com/d5r0nlvB6K

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • VIDEO | "We have decided to hold 8-10 meetings across the country. If alliance partners don't come together on one stage, then people will not know about it. It's a good thing that the meeting lasted for 2-3 hours," says Congress president @kharge on INDIA bloc meeting. pic.twitter.com/1m6YAoWycs

    — Press Trust of India (@PTI_News) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇండియా కూటమి కీలక సమావేశం- మోదీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చ

'ఇలాంటి ప్రవర్తనతో 2024 ఎన్నికల్లో మరిన్ని సీట్లు కోల్పోతారు'- ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్

India Alliance PM Candidate : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు బంగాల్‌, దిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌. అయితే ఈ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష కూటమి గెలుపే ముఖ్యమని, ఇతర విషయాలపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని ఖర్గే పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారసభల నిర్వహణే అజెండాగా దిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్లమెంటు ఉభయసభల్లో 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈనెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 10 వరకు ఇండియా కూటమి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

  • #WATCH | After the conclusion of the INDIA Alliance meeting, Congress president Mallikarjun Kharge says "We have passed a resolution that suspension is undemocratic. We will all have to fight to save democracy and all of us are ready to do that. We raised the issue of security… pic.twitter.com/nuDVQUe2Lg

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇండియా కూటమి సమష్టి పోరాటమే ప్రధాన కర్తవ్యంగా చర్చ జరిగింది. ముందు పోరాటం చేసి గెలిచిన తర్వాత, ప్రధాని ఎవరనేది నిర్ణయం తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించనున్నాము. ఒకే గొడుగు కిందకు రాకపోతే కూటమి ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించే అవకాశం లేదు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాము. పార్లమెంటులో దాడి విషయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రధాని, హోం మంత్రి ఇరువురు సభకు హాజరై వివరణ ఇవ్వాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని ప్రారంభోత్సవాలకు, పర్యటనలకు పరిమితం అవుతున్నారు. పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారి ఇంత మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని నమోస్వామ్యంగా మార్చారు.

ప్రజలతో మమేకం అయ్యి పోరాటం కొనసాగించాలని కూటమి నిర్ణయించింది. ఈనెల 22న ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తాము. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీలన్నీ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటాయి. రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి జఠిలమైన రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. దిల్లీ, పంజాబ్‌లకు సంబంధించిన వ్యూహాన్ని తరువాత ఖరారు చేస్తాము."
--మల్లిఖార్జున ఖర్గే

'ఖర్గేను మమతాబెనర్జీ ప్రతిపాదించలేదు'
అయితే, ప్రధానమంత్రిగా మల్లిఖార్జున ఖర్గేను మమతా బెనర్జీ ప్రతిపాదించలేదని చెప్పారు కాంగ్రెస్​ నేత పీసీ థామస్​. ప్రధాని అభ్యర్థిగా దళితుడు ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారని, కానీ ఎవరి పేరును చెప్పలేదని థామస్ తెలిపారు. ఆమె చివర్లో ఈ ప్రతిపాదన చేయడం వల్ల దానిపై ఎక్కువగా మాట్లాడలేదని ఆయన వివరించారు.

  • #WATCH | On the reports of West Bengal CM Mamata Banerjee proposing the name of Congress chief Mallilkarjun Kharge as the PM face of the INDIA Alliance, Kerala Congress leader PC Thomas says, "She did not suggest so. While she spoke, Mamata Banerjee said that it would be good if… pic.twitter.com/P1sBxj8KqS

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జనవరిలో రెండో వారంలో సీట్ల పంపకం
మరోవైపు సీట్ల సర్దుబాటుపై జనవరి రెండో వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, ఆర్​జేడీ అధినేత లాలుప్రసాద్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన తరఫున మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, బిహార్‌, బంగాల్‌, దిల్లీ, తమిళనాడు, పంజాబ్‌ సీఎంలు నీతీశ్‌కుమార్‌, మమతాబెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, MK స్టాలిన్‌, భగవంత్‌ మాన్‌ పాల్గొన్నారు.

  • #WATCH | After the INDIA Alliance meeting, SP chief Akhilesh Yadav says, "...All parties are ready to hit the ground after the distribution of tickets very soon."

    He also says, "I have said from the first day that the strategy of INDIA Alliance will be PDA. We will defeat… pic.twitter.com/nT5EJk1jHW

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | On the INDIA Alliance meeting, Delhi CM Arvind Kejriwal says, "The meeting was good. The campaigning, seat sharing and everything will begin soon. No (convenor hasn't been selected) yet." pic.twitter.com/d5r0nlvB6K

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • VIDEO | "We have decided to hold 8-10 meetings across the country. If alliance partners don't come together on one stage, then people will not know about it. It's a good thing that the meeting lasted for 2-3 hours," says Congress president @kharge on INDIA bloc meeting. pic.twitter.com/1m6YAoWycs

    — Press Trust of India (@PTI_News) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇండియా కూటమి కీలక సమావేశం- మోదీని గద్దెదించడమే లక్ష్యంగా వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చ

'ఇలాంటి ప్రవర్తనతో 2024 ఎన్నికల్లో మరిన్ని సీట్లు కోల్పోతారు'- ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Last Updated : Dec 19, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.