ETV Bharat / bharat

అనాథ బాలికపై అత్యాచారం- ఫోన్​లో చిత్రీకరించి..

అనాథ బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ దృశ్యాలను తమ ఫోన్​​లో చిత్రీకరించి బెదిరించిన దిగ్భ్రాంతికర ఘటన మహారాష్ట్రలో జరిగింది.

author img

By

Published : Aug 14, 2021, 5:44 PM IST

Updated : Aug 14, 2021, 6:17 PM IST

అత్యాచారం
అత్యాచారం

ఓ అనాథ బాలికపై సామూహిక అత్యాచారం మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. ఆ దృశ్యాలను తమ ఫోన్​​లో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇదీ జరిగింది..

జల్నా జిల్లా బద్నాపూర్ తాలూకా కందారి ఖుర్ద్ గ్రామంలోని ఓ పూజారికి దత్తత కూతురు(అనాథ) ఉంది. ఆ బాలిక శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో లక్ష్మణనగర్ తండాకు వెళుతోంది. ఆమెను దారిలో అడ్డగించిన సోపన్ ధక్నే, శంభు ధక్నే అనే ఇద్దరు యువకులు.. పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోన్​లో తీసిన వీడియోను అందరికీ చూపించి పరువు తీస్తామని, చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాలికను రోడ్డుపక్కన వదిలేసి వెళ్లారు.

అటుగా వెళ్తున్న కొందరు అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యులైన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

అనాథ బాలికకు జరిగిన ఈ అన్యాయంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

ఓ అనాథ బాలికపై సామూహిక అత్యాచారం మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. ఆ దృశ్యాలను తమ ఫోన్​​లో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.

ఇదీ జరిగింది..

జల్నా జిల్లా బద్నాపూర్ తాలూకా కందారి ఖుర్ద్ గ్రామంలోని ఓ పూజారికి దత్తత కూతురు(అనాథ) ఉంది. ఆ బాలిక శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో లక్ష్మణనగర్ తండాకు వెళుతోంది. ఆమెను దారిలో అడ్డగించిన సోపన్ ధక్నే, శంభు ధక్నే అనే ఇద్దరు యువకులు.. పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోన్​లో తీసిన వీడియోను అందరికీ చూపించి పరువు తీస్తామని, చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాలికను రోడ్డుపక్కన వదిలేసి వెళ్లారు.

అటుగా వెళ్తున్న కొందరు అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యులైన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

అనాథ బాలికకు జరిగిన ఈ అన్యాయంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2021, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.