ETV Bharat / bharat

దేశంలో 21శాతం మందిపై కరోనా ప్రభావం: ఐసీఎంఆర్​

author img

By

Published : Feb 4, 2021, 7:14 PM IST

Updated : Feb 4, 2021, 7:25 PM IST

కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు ఐసీఎంఆర్​ నిర్వహించిన సెరో సర్వేలో పలు ఆకసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో 21శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. మూడో విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో మొత్తం 28,589 మందిపై ఈ పరీక్షలు జరిపారు.

icmr, survey
సెరో సర్వే వివరాలు వెల్లడించిన ఐసీఎంఆర్

దేశంలో 21శాతం మంది ప్రజలు కరోనా ప్రభావానికి గురైనట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) చేసిన సెరో సర్వేలో తేలింది. ఐసీఎంఆర్​ గతేడాది డిసెంబర్‌ 7 నుంచి ఈ ఏడాది జనవరి 8వరకూ జాతీయ స్థాయిలో జరిపిన సెరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా 28వేల 589 మందిపై అధ్యయనం చేయగా ఇందులో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 21.4శాతం మంది కరోనా ప్రభావానికి గురైనట్లు తేలింది. 10 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న 25.3శాతం మందిలో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. అలాగే పట్టణ మురికివాడల్లో 31.7 శాతం, మండల స్థాయి మురికివాడల్లో 26.2 శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో అది 19.1 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు 7వేల 171 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించగా అందులో 25.7 శాతం మంది వైరస్‌ బారిన పడినట్లు తేలింది.

ఇదీ చదవండి : భారత్‌లో 30 కోట్ల మందికి కరోనా?

దేశంలో 21శాతం మంది ప్రజలు కరోనా ప్రభావానికి గురైనట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) చేసిన సెరో సర్వేలో తేలింది. ఐసీఎంఆర్​ గతేడాది డిసెంబర్‌ 7 నుంచి ఈ ఏడాది జనవరి 8వరకూ జాతీయ స్థాయిలో జరిపిన సెరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా 28వేల 589 మందిపై అధ్యయనం చేయగా ఇందులో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 21.4శాతం మంది కరోనా ప్రభావానికి గురైనట్లు తేలింది. 10 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న 25.3శాతం మందిలో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. అలాగే పట్టణ మురికివాడల్లో 31.7 శాతం, మండల స్థాయి మురికివాడల్లో 26.2 శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో అది 19.1 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు 7వేల 171 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరించగా అందులో 25.7 శాతం మంది వైరస్‌ బారిన పడినట్లు తేలింది.

ఇదీ చదవండి : భారత్‌లో 30 కోట్ల మందికి కరోనా?

Last Updated : Feb 4, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.