ఈరోజు(9-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తీక మాసం; శుక్లపక్షం
పంచమి: మ. 3.57 తదుపరి షష్ఠి
పూర్వాషాఢ: రా.10.53 తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ఉ. 9.23 నుంచి 10.53 వరకు
అమృత ఘడియలు: సా.6.23 నుంచి 7.53 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.20 నుంచి 9.05 వరకు; తిరిగి రా. 10.27 నుంచి 11.18 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6.05, సూర్యాస్తమయం: సా.5-23
మేషం
ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. దుర్గారాధన శుభప్రదం.
మిథునం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధు,మిత్రుల సలహాలు సూచనలు మేలు చేస్తాయి. ప్రణాళికలేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. శివారాధన చేస్తే మంచిది.
కర్కాటకం
మంచి కాలం. మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. మనఃసౌఖ్యం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివ పార్వతుల ఆరాధన శక్తిని ఇస్తుంది.
సింహం
శ్రమ ఫలిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు, సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
కన్య
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
తుల
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠనం శుభకరం.
వృశ్చికం
సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులు, పెద్దలతోను కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.
మకరం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలుగుతాయి. సంబంధబాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ, అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.
కుంభం
మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.
మీనం
మనః స్సౌఖ్యం ఉంటుంది. ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.