ETV Bharat / bharat

కూలిన నేవీ హెలికాప్టర్​-రన్​వేపై నిల్చున్న అధికారి మృతి, టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే క్రాష్​

author img

By PTI

Published : Nov 4, 2023, 3:50 PM IST

Updated : Nov 4, 2023, 6:21 PM IST

Helicopter Crash in Kochi Today : కేరళ కొచ్చిలో శిక్షణ హెలికాప్టర్ కూలి ఓ నేవీ అధికారి మరణించారు. చేతక్ హెలికాప్టర్​ శిక్షణలో భాగంగా టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే విమానం కూలినట్లు నేవీ అధికారులు తెలిపారు.

Helicopter Crash in Kochi Today
Helicopter Crash in Kochi Today

Helicopter Crash in Kochi Today : కేరళ కొచ్చిలో శిక్షణ హెలికాప్టర్ కూలి ఓ నేవీ అధికారి మరణించారు. శనివారం మధ్యాహ్నం ఐఎన్​ఎస్​ గరుడ రన్​వేపై ఈ ప్రమాదం జరిగింది. చేతక్ హెలికాప్టర్​ శిక్షణలో భాగంగా టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే విమానం కూలినట్లు నేవీ అధికారులు తెలిపారు. రన్​వే పై నిల్చున్న అధికారి మరణించగా.. హెలికాప్టర్​లోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని యోగేంద్ర సింగ్​గా గుర్తించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు నేవీ చీఫ్​ అడ్మిరల్​ ఆర్ హరి కుమార్​. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • "Adm R Hari Kumar #CNS & all personnel of #IndianNavy mourn the loss of life & pay tribute to Yogendra Singh, LAM who lost his life in the unfortunate accident at Kochi and extend heartfelt condolences to the bereaved family," posts @indiannavy. pic.twitter.com/0UyLuIOBlP

    — Press Trust of India (@PTI_News) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొచ్చిలోని ఐఎన్​ఎస్​ గరుడ రన్​వేపై చేతక్​ హెలికాప్టర్​ ప్రమాదానికి గురైంది. నిర్వహణలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక గ్రౌండ్​ అధికారి మరణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం.

--భారత నేవీ అధికారి

దీనిపై సమాచారం అందుకున్న కొచ్చి పోలీసులు, నేవీ అధికారులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ హెలికాప్టర్ డీకమీషన్​కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది నేవీ. ప్రమాదానికి కారణం సాంకేతిక వైఫల్యమా? లేక వాతావరణ సమస్యా? అని దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ చేతక్​ హెలికాప్టర్​లో ఏడుగురు కూర్చునే అవకాశం ఉండగా.. ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో ఇద్దరు ఉన్నారు.

కూలిన ఆర్మీ హెలికాప్టర్​.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
అంతకుముందు జమ్ము కశ్మీర్​లో ఓ ఆర్మీ హెలికాప్టర్​ కూలగా.. ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్‌ చాపర్‌.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్​, కో పైలట్, టెక్నీషియన్​ హెలికాప్టర్‌లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుల్ని ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించాయి. అయితే.. తీవ్రంగా గాయపడిన టెక్నీషియన్.. కాసేపటికి మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందస్తుగా ల్యాండింగ్ చేస్తున్నామని పైలట్లు ముందుగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​- ఏటీసీకి సమాచారం ఇచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే.. పర్వత ప్రాంతం, నది ఒడ్డున కావడం వల్ల ఇలా హార్డ్ ల్యాండింగ్ జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.

ఎయిర్​పోర్టులో కూలిన హెలికాప్టర్​.. ల్యాండింగ్​ సమయంలో..

విషాదం.. ఆర్మీ ఛాపర్​ క్రాష్​.. ఇద్దరు పైలట్లు మృతి

Helicopter Crash in Kochi Today : కేరళ కొచ్చిలో శిక్షణ హెలికాప్టర్ కూలి ఓ నేవీ అధికారి మరణించారు. శనివారం మధ్యాహ్నం ఐఎన్​ఎస్​ గరుడ రన్​వేపై ఈ ప్రమాదం జరిగింది. చేతక్ హెలికాప్టర్​ శిక్షణలో భాగంగా టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే విమానం కూలినట్లు నేవీ అధికారులు తెలిపారు. రన్​వే పై నిల్చున్న అధికారి మరణించగా.. హెలికాప్టర్​లోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడిని యోగేంద్ర సింగ్​గా గుర్తించారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు నేవీ చీఫ్​ అడ్మిరల్​ ఆర్ హరి కుమార్​. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • "Adm R Hari Kumar #CNS & all personnel of #IndianNavy mourn the loss of life & pay tribute to Yogendra Singh, LAM who lost his life in the unfortunate accident at Kochi and extend heartfelt condolences to the bereaved family," posts @indiannavy. pic.twitter.com/0UyLuIOBlP

    — Press Trust of India (@PTI_News) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొచ్చిలోని ఐఎన్​ఎస్​ గరుడ రన్​వేపై చేతక్​ హెలికాప్టర్​ ప్రమాదానికి గురైంది. నిర్వహణలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక గ్రౌండ్​ అధికారి మరణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం.

--భారత నేవీ అధికారి

దీనిపై సమాచారం అందుకున్న కొచ్చి పోలీసులు, నేవీ అధికారులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ హెలికాప్టర్ డీకమీషన్​కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది నేవీ. ప్రమాదానికి కారణం సాంకేతిక వైఫల్యమా? లేక వాతావరణ సమస్యా? అని దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ చేతక్​ హెలికాప్టర్​లో ఏడుగురు కూర్చునే అవకాశం ఉండగా.. ప్రమాద సమయంలో హెలికాప్టర్​లో ఇద్దరు ఉన్నారు.

కూలిన ఆర్మీ హెలికాప్టర్​.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
అంతకుముందు జమ్ము కశ్మీర్​లో ఓ ఆర్మీ హెలికాప్టర్​ కూలగా.. ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్‌ చాపర్‌.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్​, కో పైలట్, టెక్నీషియన్​ హెలికాప్టర్‌లో ఉన్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుల్ని ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించాయి. అయితే.. తీవ్రంగా గాయపడిన టెక్నీషియన్.. కాసేపటికి మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ముందస్తుగా ల్యాండింగ్ చేస్తున్నామని పైలట్లు ముందుగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​- ఏటీసీకి సమాచారం ఇచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే.. పర్వత ప్రాంతం, నది ఒడ్డున కావడం వల్ల ఇలా హార్డ్ ల్యాండింగ్ జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది.

ఎయిర్​పోర్టులో కూలిన హెలికాప్టర్​.. ల్యాండింగ్​ సమయంలో..

విషాదం.. ఆర్మీ ఛాపర్​ క్రాష్​.. ఇద్దరు పైలట్లు మృతి

Last Updated : Nov 4, 2023, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.