ETV Bharat / bharat

ఒకేసారి ఆన్​లైన్ క్లాస్​కు 1.12 లక్షల మంది- గిన్నిస్ రికార్డు

author img

By

Published : May 6, 2021, 5:25 PM IST

'ఏఐ ఫర్ ఇండియా' పేరుతో ఆన్​లైన్ క్లాసులు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్​ ది వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాయి మద్రాస్ అనుబంధ అంకుర సంస్థ గవీ, ఏఐసీటీఈ. పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్​పై 24 గంటల పాటు క్లాస్​లు నిర్వహించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి.

AI class
గిన్నిస్ రికార్డు, ఆన్​లైన్ క్లాస్

ఒకేసారి 1.12 లక్షల మందికి ఆన్​లైన్ క్లాస్ నిర్వహించి గిన్నిస్ బుక్​ ఆఫ్​ ది వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాయి ఐఐటీ మద్రాస్​కు చెందిన అంకుర సంస్థ గవీ, ఆల్​ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సంస్థలు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్​పై 24 గంటల పాటు క్లాస్ నిర్వహించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి.

ఏప్రిల్​ 30 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందించారు.

AI for India
ఆన్​లైన్ తరగతికి హాజరైన విద్యార్థులు

'ఏఐ ఫర్ ఇండియా' పేరుతో ఏప్రిల్ 24- 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 24 గంటల వ్యవధిలో ఎక్కువ మంది ప్రోగ్రామింగ్ క్లాసుకు హాజరవడం వల్ల ఈ ఘనతను సాధించాయి.

AI for India
ఎక్కువ మందితో ఆన్​లైన్ క్లాస్

దేశంలోని ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ గురించి తెలియాలనే లక్షంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గవీ(జీయూవీఐ) సహవ్యవస్థాపకురాలు శ్రీదేవి తెలిపారు.

AI for India
గిన్నిస్ బుక్​ ఆఫ్​ ది వరల్డ్ రికార్డులో చోటు

ఈ కార్యక్రమంలో భాగంగానే.. ఫేస్ రికగ్నిషన్ యాప్​ అభివృద్ధిపై నిర్వహించిన ఆన్​లైన్​ క్లాస్​కు 1.43 లక్షల మంది హాజరయ్యారు. ఏఐసీటీఈ, గవీ, ఐఐటీ మద్రాస్ పరిశోధన కేంద్రం బుద్ధి.ఏఐ .. సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. పాఠశాల స్థాయి విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నాన్ ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోడింగ్​పై ఆసక్తి ఉన్న 8 నుంచి 80 ఏళ్ల లోపు ఎందరో.. ఇందులో పాలు పంచుకున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:రూ.21కోట్ల యురేనియం స్వాధీనం- ఇద్దరు రిమాండ్​

ఒకేసారి 1.12 లక్షల మందికి ఆన్​లైన్ క్లాస్ నిర్వహించి గిన్నిస్ బుక్​ ఆఫ్​ ది వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించాయి ఐఐటీ మద్రాస్​కు చెందిన అంకుర సంస్థ గవీ, ఆల్​ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సంస్థలు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్​పై 24 గంటల పాటు క్లాస్ నిర్వహించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి.

ఏప్రిల్​ 30 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందించారు.

AI for India
ఆన్​లైన్ తరగతికి హాజరైన విద్యార్థులు

'ఏఐ ఫర్ ఇండియా' పేరుతో ఏప్రిల్ 24- 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 24 గంటల వ్యవధిలో ఎక్కువ మంది ప్రోగ్రామింగ్ క్లాసుకు హాజరవడం వల్ల ఈ ఘనతను సాధించాయి.

AI for India
ఎక్కువ మందితో ఆన్​లైన్ క్లాస్

దేశంలోని ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ గురించి తెలియాలనే లక్షంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గవీ(జీయూవీఐ) సహవ్యవస్థాపకురాలు శ్రీదేవి తెలిపారు.

AI for India
గిన్నిస్ బుక్​ ఆఫ్​ ది వరల్డ్ రికార్డులో చోటు

ఈ కార్యక్రమంలో భాగంగానే.. ఫేస్ రికగ్నిషన్ యాప్​ అభివృద్ధిపై నిర్వహించిన ఆన్​లైన్​ క్లాస్​కు 1.43 లక్షల మంది హాజరయ్యారు. ఏఐసీటీఈ, గవీ, ఐఐటీ మద్రాస్ పరిశోధన కేంద్రం బుద్ధి.ఏఐ .. సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. పాఠశాల స్థాయి విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నాన్ ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోడింగ్​పై ఆసక్తి ఉన్న 8 నుంచి 80 ఏళ్ల లోపు ఎందరో.. ఇందులో పాలు పంచుకున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:రూ.21కోట్ల యురేనియం స్వాధీనం- ఇద్దరు రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.