ETV Bharat / bharat

'ఆశారాం​ ఆశ్రమంలో హైదరాబాదీ మిస్సింగ్'​ కేసులో కొత్త ట్విస్ట్​!

author img

By

Published : Nov 18, 2021, 2:27 PM IST

Updated : Nov 18, 2021, 2:36 PM IST

అహ్మదాబాద్​లోని ఆశారాం ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లి అదృశ్యమైన హైదరాబాద్​ యువకుడి కేసులో కొత్త ట్విస్ట్​ వెలుగులోకి వచ్చింది. తాను క్షేమంగానే ఉన్నానంటూ ఓ వీడియో పంపారు కనిపించకుండా పోయిన విజయ్​ యాదవ్​. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు.

Hyderabad missing man case
హైదరాబాదీ మిస్సింగ్​

స్నేహితులతో కలిసి అహ్మదాబాద్​లోని ఆశారాం బాపు ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లి అదృశ్యమైన హైదరాబాద్​ యువకుడి కేసు కొత్త మలుపు తిరిగింది. నవంబర్​ 11న కనిపించకుండా పోయిన విజయ్​ యాదవ్​.. బుధవారం(నవంబర్​ 17) ఓ వీడియోను విడుదల చేశారు. అయితే.. విజయ్​ ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

వీడియోలో.. తాను నవంబర్​ 10న షిబిర్​ సందర్శన పూర్తి చేసుకుని వైష్ణోదేవిని(vaishno devi mandir) దర్శించుకునేందుకు జమ్ముకశ్మీర్​ వెళ్లినట్లు చెప్పారు విజయ్​. జమ్మూ సరిహద్దు దాటగానే.. నెట్​వర్క్​ సిగ్నల్​ అందక మొబైల్​ పనిచేయలేదన్నారు. ఆశారాం ఆశ్రమంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తన సొంత నిర్ణయంతోనే జమ్మూ వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు విజయ్​.

వీడియోలో మాట్లాడుతున్న విజయ్​ యాదవ్​

ఈమెయిల్​ ద్వారా..

అంతకుముందు.. విజయ్​ తమకు గత మంగళవారం(నవంబర్​16) ఈమెయిల్​ పంపారని ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) అధికారులు పోలీసులకు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పిట్లు పేర్కొన్నారు. విజయ్​ ఐడీ నుంచే మెయిల్​ వచ్చిందని తెలిపారు. ' తాను స్వచ్ఛందంగానే వెళ్లానని, త్వరలోనే తిరిగి వస్తానని ఈమెయిల్​లో విజయ్​ పేర్కొన్నారు. ఈమెయిల్​ పంపేందుకు ఉపయోగించిన కంప్యూటర్​ ఐపీ అడ్రస్​తో విజయ్​ ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అతని ఫోన్​ నంబర్​ కాల్​ రికార్డులు సేకరిస్తున్నాం. ' అని పోలీసులు వెల్లడించారు.

Hyderabad missing man case
విజయ్​ పంపిన ఈమెయిల్​

ఇదీ జరిగింది..

స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌లోని ఆశారాం ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లిన హైదరాబాద్​ యువకుడు విజయ్‌ యాదవ్‌ 11వ తేదీన అదృశ్యమయ్యారు. సబర్మతి ప్రాంతంలోని ఆశ్రమంలో ఈ నెల 3న ఓ శిబిరానికి హాజరై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మరో శిబిరానికి వెళ్లిన యాదవ్‌ మళ్లీ అహ్మదాబాద్‌కు వచ్చి, కనిపించకుండా పోయారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

'నవంబర్​ 3న ఆశారాం ఆశ్రమంలో ఓ వర్క్​షాప్​లో పాల్గొనేందుకు విజయ్​ అహ్మదాబాద్​ వచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్​లోని జోధ్​పుర్​ వెళ్లాడు. మళ్లీ అహ్మదాబాద్​ ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటినుంచి కనిపించడం లేదు. ఆశ్రమంలో రిజిస్టర్​ చెక్​ చేశాం. లోపలికి ప్రవేశించినట్లు ఉంది కానీ.. బయటికి ఎప్పటికి వెళ్లాడన్నది లేదు. అదే ఇప్పుడు ఆశ్రమం నుంచి విజయ్​ ఎటు వెళ్లాడన్నది అంతుచిక్కని ప్రశ్న. సీసీటీవీ ఫుటేజీని అడిగితే.. నవంబర్​ 11వ తేదీది మిస్​ అయిందని అంటున్నారు. పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాం.' అని విజయ్​ కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: సైనికుడి భౌతిక కాయం వద్ద తండ్రి భావోద్వేగం- వీడియో వైరల్

స్నేహితులతో కలిసి అహ్మదాబాద్​లోని ఆశారాం బాపు ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లి అదృశ్యమైన హైదరాబాద్​ యువకుడి కేసు కొత్త మలుపు తిరిగింది. నవంబర్​ 11న కనిపించకుండా పోయిన విజయ్​ యాదవ్​.. బుధవారం(నవంబర్​ 17) ఓ వీడియోను విడుదల చేశారు. అయితే.. విజయ్​ ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

వీడియోలో.. తాను నవంబర్​ 10న షిబిర్​ సందర్శన పూర్తి చేసుకుని వైష్ణోదేవిని(vaishno devi mandir) దర్శించుకునేందుకు జమ్ముకశ్మీర్​ వెళ్లినట్లు చెప్పారు విజయ్​. జమ్మూ సరిహద్దు దాటగానే.. నెట్​వర్క్​ సిగ్నల్​ అందక మొబైల్​ పనిచేయలేదన్నారు. ఆశారాం ఆశ్రమంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తన సొంత నిర్ణయంతోనే జమ్మూ వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే తిరిగి వస్తానని చెప్పారు విజయ్​.

వీడియోలో మాట్లాడుతున్న విజయ్​ యాదవ్​

ఈమెయిల్​ ద్వారా..

అంతకుముందు.. విజయ్​ తమకు గత మంగళవారం(నవంబర్​16) ఈమెయిల్​ పంపారని ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) అధికారులు పోలీసులకు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పిట్లు పేర్కొన్నారు. విజయ్​ ఐడీ నుంచే మెయిల్​ వచ్చిందని తెలిపారు. ' తాను స్వచ్ఛందంగానే వెళ్లానని, త్వరలోనే తిరిగి వస్తానని ఈమెయిల్​లో విజయ్​ పేర్కొన్నారు. ఈమెయిల్​ పంపేందుకు ఉపయోగించిన కంప్యూటర్​ ఐపీ అడ్రస్​తో విజయ్​ ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. అతని ఫోన్​ నంబర్​ కాల్​ రికార్డులు సేకరిస్తున్నాం. ' అని పోలీసులు వెల్లడించారు.

Hyderabad missing man case
విజయ్​ పంపిన ఈమెయిల్​

ఇదీ జరిగింది..

స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌లోని ఆశారాం ఆశ్రమ(asharamji bapu ashram ahmedabad) సందర్శనకు వెళ్లిన హైదరాబాద్​ యువకుడు విజయ్‌ యాదవ్‌ 11వ తేదీన అదృశ్యమయ్యారు. సబర్మతి ప్రాంతంలోని ఆశ్రమంలో ఈ నెల 3న ఓ శిబిరానికి హాజరై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మరో శిబిరానికి వెళ్లిన యాదవ్‌ మళ్లీ అహ్మదాబాద్‌కు వచ్చి, కనిపించకుండా పోయారు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

'నవంబర్​ 3న ఆశారాం ఆశ్రమంలో ఓ వర్క్​షాప్​లో పాల్గొనేందుకు విజయ్​ అహ్మదాబాద్​ వచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్​లోని జోధ్​పుర్​ వెళ్లాడు. మళ్లీ అహ్మదాబాద్​ ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటినుంచి కనిపించడం లేదు. ఆశ్రమంలో రిజిస్టర్​ చెక్​ చేశాం. లోపలికి ప్రవేశించినట్లు ఉంది కానీ.. బయటికి ఎప్పటికి వెళ్లాడన్నది లేదు. అదే ఇప్పుడు ఆశ్రమం నుంచి విజయ్​ ఎటు వెళ్లాడన్నది అంతుచిక్కని ప్రశ్న. సీసీటీవీ ఫుటేజీని అడిగితే.. నవంబర్​ 11వ తేదీది మిస్​ అయిందని అంటున్నారు. పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశాం.' అని విజయ్​ కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: సైనికుడి భౌతిక కాయం వద్ద తండ్రి భావోద్వేగం- వీడియో వైరల్

Last Updated : Nov 18, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.