ETV Bharat / bharat

మోర్బీ ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ.. ప్రభుత్వానికి నోటీసులు

author img

By

Published : Nov 7, 2022, 1:36 PM IST

Updated : Nov 7, 2022, 4:41 PM IST

మోర్బీ వంతెన కూలిన ఘటనకు సంబంధించి గుజరాత్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ రాష్ట్ర హోంశాఖ, మోర్బీ మున్సిపాలిటీకి నోటీసులు జారీ చేసింది.

morbi bridge
కూలిన మోర్బీ వంతెన

గుజరాత్​లో అక్టోబర్ 30న బ్రిటిష్ కాలం నాటి వేలాడే మోర్బీ వంతెన కూలిపోయి 135 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను సమర్పించమని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది.

మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెన కొన్నేళ్లగా నిరుపయోగంగా ఉండి దాదాపు ఏడు నెలలు మరమ్మతులు చేసి ఇటీవల అక్టోబర్ 26 నే తెరిచారు. అయితే ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను చూడటానికి వచ్చినవారంతా బ్రిడ్జి కూలడం వల్ల నదిలో పడిపోయారు. అయితే అందులో 135 మంది మృతి చెందగా, 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

మున్సిపాలిటీ పత్రాల ప్రకారం, ఒరేవా గ్రూప్ సంస్థ ఈ వంతెన మరమ్మతులు, నిర్వహణ చెపట్టేందుకు, 15 సంవత్సరాలు పాటు సందర్శకుల వద్ద 10 నుంచి 15 రూపాయల టిక్కెట్​ రుసుము వసూలు చేసుకునేందుకు నగర మున్సిపాలిటీ ఒప్పందం చేసుకుంది. అయితే వంతెన మరమ్మతుల నిమిత్తం ఒరేవా గ్రూప్, నిపుణులను నియమించి ప్రత్యేక సంస్థల నుంచి మెటీరియల్ తెప్పించి పనులు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఈ సంస్థ మెరుగైన మరమ్మతులు చేయలేని కారణంగానే వంతెన కూలిపోయి ఉండొచ్చని ఒరేవా గ్రూప్​లో నలుగురితో సహా తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:హత్యాచారం కేసులో వారికి మరణ శిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీం తీర్పు

రైల్లో వెళ్తున్న 'ఆమె'పై డౌట్.. చెక్ చేస్తే బ్యాగులో పాములు, బల్లులు, సాలీళ్లు

గుజరాత్​లో అక్టోబర్ 30న బ్రిటిష్ కాలం నాటి వేలాడే మోర్బీ వంతెన కూలిపోయి 135 మంది మరణించిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను సమర్పించమని చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ శాస్త్రితో కూడిన డివిజన్ బెంచ్ గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా నవంబర్ 14 లోపు ఈ విషయంపై నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది.

మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెన కొన్నేళ్లగా నిరుపయోగంగా ఉండి దాదాపు ఏడు నెలలు మరమ్మతులు చేసి ఇటీవల అక్టోబర్ 26 నే తెరిచారు. అయితే ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వంతెనను చూడటానికి వచ్చినవారంతా బ్రిడ్జి కూలడం వల్ల నదిలో పడిపోయారు. అయితే అందులో 135 మంది మృతి చెందగా, 170 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

మున్సిపాలిటీ పత్రాల ప్రకారం, ఒరేవా గ్రూప్ సంస్థ ఈ వంతెన మరమ్మతులు, నిర్వహణ చెపట్టేందుకు, 15 సంవత్సరాలు పాటు సందర్శకుల వద్ద 10 నుంచి 15 రూపాయల టిక్కెట్​ రుసుము వసూలు చేసుకునేందుకు నగర మున్సిపాలిటీ ఒప్పందం చేసుకుంది. అయితే వంతెన మరమ్మతుల నిమిత్తం ఒరేవా గ్రూప్, నిపుణులను నియమించి ప్రత్యేక సంస్థల నుంచి మెటీరియల్ తెప్పించి పనులు పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే ఈ సంస్థ మెరుగైన మరమ్మతులు చేయలేని కారణంగానే వంతెన కూలిపోయి ఉండొచ్చని ఒరేవా గ్రూప్​లో నలుగురితో సహా తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:హత్యాచారం కేసులో వారికి మరణ శిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీం తీర్పు

రైల్లో వెళ్తున్న 'ఆమె'పై డౌట్.. చెక్ చేస్తే బ్యాగులో పాములు, బల్లులు, సాలీళ్లు

Last Updated : Nov 7, 2022, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.